Amit Shah: ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు
తెలంగాణలో రజాకార్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..
కేసీఆర్ను తరిమితేనే రజాకార్ పాలన అంతం
ఒక్క హామీనీ నెరవేర్చకుండానే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
నిధులు, నీళ్లు నియామకాలు నెరవేరుస్తాం
మైనారిటీ రిజర్వేషన్లు తగ్గిస్తాం
ముందస్తు ఎన్నికల యోచనలో కేసీఆర్
అందుకు మేమూ సిద్ధమే
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్ షా
నయా నిజాంను గద్దె దించేద్దాం...
తెలంగాణ నుంచి నయా నిజాం నవాబును వెళ్లగొట్టాలా వద్దా... పాలనలో మార్పు రావాలని కోరుకునేవారంతా చేతులు పైకెత్తి మద్దతు తెలపండి. ప్రజా సంగ్రామ యాత్ర భాజపా అధికారం కోసమో.. ఒకరిని దించి మరొకరిని సీఎంగా చేయడానికో కాదు. దళితులు, ఆదివాసీ, యువత, రైతుల సంక్షేమానికి చేస్తున్న యాత్ర. రాష్ట్రంలో రజాకార్ ప్రతినిధి కుటుంబ పాలన సాగుతోంది. ‘‘నా కొడుకు, నా బిడ్డ’’ అంటూ కేసీఆర్ సాగిస్తున్న అవినీతి పాలనను అంతమొందించడానికే ఈ యాత్ర.
- అమిత్ షా
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో రజాకార్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్ పూర్తి చేస్తారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఎవరో తాంత్రికుడు చెప్పాడని సీఎం సచివాలయానికి వెళ్లడం లేదన్నారు. కేసీఆర్ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆయనను గద్దె దించేందుకు యువత కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ మరో బెంగాల్గా మారుస్తున్నారని, హత్యా రాజకీయాలతో తమ కార్యకర్త సాయిగణేశ్ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపుతామన్నారు. తెరాస, మజ్లిస్ పార్టీలు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారని, ఎన్నికలకు తామూ సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ను, మజ్లిస్ను గద్దె దించిన నాడే తెలంగాణకు విమోచన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక.. మైనార్టీల రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు కోటా పెంచుతామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారుతోపాటు, తెలంగాణలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడాలని.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఉప్పుడు బియ్యం కొంటామని హామీ ఇచ్చారు.
పథకాలకు పేర్లు మార్చి..
‘మోదీ ప్రభుత్వం రాష్ట్రం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ కేంద్ర పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్రం నిధులిస్తే.. మన ఊరు..మనబడి’ పేరుతో మీ కుమారుడి పేరు పెట్టి అమలు చేస్తున్నారు. రూ.18 వేల కోట్లు ఉపాధి హామీ పథకానికిస్తే మీ, మీ కుమారుడి ఫొటోలు పెట్టుకున్నారు. ప్రధాని ఆవాస్ యోజన పేరు మార్చినా ఇళ్లు ఇవ్వలేదు. పీఎం అన్న కల్యాణ్ యోజన కింద ప్రతి వ్యక్తికి ప్రతి నెలా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంటే మీ ఫొటోలతో పంపిణీ చేస్తున్నారు.
ఆ పథకాల అమలేది?
కేంద్ర పథకాలను తెలంగాణ అమలు చేయడం లేదు. ఆయుష్మాన్భారత్ కింద పేదలకు రూ.5 లక్షల వరకూ వైద్యం చేస్తామంటే అడ్డుకుంటున్నారు. పంటలబీమా పథకం అమలు చేయడం లేదు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, రాజోలిబండ వంటి పథకాలకు కేంద్రం నిధులిచ్చినా అమలు చేయడం లేదు. సైన్స్ సిటీ పెడతామంటే 25 ఎకరాలు ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ పెడతామని 2017 నుంచి కేంద్రం లేఖలు రాస్తున్నా స్పందించలేదు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ సంక్షేమానికి రూ.2,52,202 కోట్లు ఇచ్చారు. రేపు మీడియాలో ఈ జాబితా మొత్తం వస్తే చదువుకోండి. మేం ఏం ఇచ్చామో తెలుస్తుంది. ప్రాంతీయ రింగురోడ్డుకు రూ. 8 వేల కోట్లు, గ్రామీణ సడక్ యోజనకు రూ.17 వేల కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.25 వేల కోట్లు ఇచ్చాం.’
ఎన్నికలకు సిద్ధం
మజ్లిస్కు భయపడే 370 ఆర్టికల్ రద్దును కేసీఆర్ వ్యతిరేకించారు. భాజపా భయపడదు. ఆ రెండు పార్టీలనూ ఒకేసారి పక్కకు నెట్టి అధికారంలోకి వస్తుంది. తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తుంది. తెరాస కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది. కేసీఆర్ వారసత్వ రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. కుమారుడు, కుమార్తె కోసం కేసీఆర్ ఎన్ని స్కాములు చేశారో. శాసనసభలో ఒక్క సీటు గెలిచిన భాజపా ఎంపీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకుంది. బల్దియా ఎన్నికల్లో 40 స్థానాలు గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్లలో మేమే గెలిచాం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మాకూ కావాలి. రేపు ఎన్నికలు పెట్టినా భాజపా సిద్ధంగా ఉంది’ అని అమిత్షా స్పష్టం చేశారు.
కేసీఆర్ను దించడానికి బండి సంజయ్ ఒక్కరు చాలు
బండి సంజయ్ చేపట్టిన యాత్ర గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ గురించి వింటున్నా. ఈ సభలో సంజయ్ ప్రసంగం విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. కేసీఆర్ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ ఒక్కరూ చాలు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో 770 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేశారు. ఈ యాత్ర కొనసాగించడానికి మిస్డ్కాల్ ఇవ్వండి. అందరూ ఫోన్ తీసి పైకి చూపండి. 6359119119 నంబరుకు మిస్డ్కాల్ ఇవ్వండి. బండి యాత్రను మీరు సమర్థిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.
హామీలు అటకెక్కాయి...
‘కేసీఆర్ ఇచ్చిన హామీలు.. నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరాయా చెప్పండి. భాజపా అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగులకు భృతి వచ్చిందా? రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేశారా? లేదు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదు. రెండు పడకగదుల ఇళ్లు లేవు. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు కూడా నిర్మించలేదు. దళితులకు కేటాయించిన రూ.50 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది? ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఏమైంది? 30 సెంటీమీటర్లు కూడా ఇవ్వలేదు. టీచర్ పోస్టుల భర్తీని కేసీఆర్ అటకెక్కించారు. హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టలేదు. మీ కుమారుడు, కుమార్తెకు అధికారం ఇచ్చి సర్పంచులు, ఉపసర్పంచులకు అధికారాలివ్వడం మర్చిపోయారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.1340 ఉంటే.. మోదీ ప్రధాని అయ్యాక రూ.1940కి పెంచారు. కేంద్రం ధాన్యం కొనడం లేదని కేసీఆర్ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఉప్పుడు బియ్యం కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మీకు కొనడం చేతకాకపోతే రాజీనామా చేయండి. భాజపా వస్తే ప్రతి కిలో ధాన్యాన్నీ కొంటుంది. ఉప్పుడు బియ్యమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ