Agnipath: నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులంతా ఇంటికే!
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా తమ
ఆ తర్వాతే రెగ్యులర్ సర్వీసు కోసం దరఖాస్తు
‘25% ఎంపిక’ పూర్తిగా సైన్యం ఇష్టం
దీనిపై అభ్యర్థులకు హక్కు ఉండదు
నోటిఫికేషన్లో ఆర్మీ స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే వారందరినీ నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగించనున్నట్లు సైన్యం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 25% మందిని రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవడమన్నది పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్నివీరులకు ఎలాంటి హక్కూ ఉండదని స్పష్టంచేసింది. నోటిఫికేషన్లోని అంశాలివీ..
* సంస్థాగత అవసరాలు, భవిష్యత్తులో ప్రకటించే విధానాల ఆధారంగా నాలుగేళ్ల సర్వీసు పరిమితిని పూర్తిచేసిన అగ్నివీరులకు భారత సైన్యంలోని రెగ్యులర్ కేడర్కు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ఇస్తారు. ఈ దరఖాస్తులను సైన్యం కేంద్రీకృతంగా పరిశీలిస్తుంది. నాలుగేళ్ల విధినిర్వహణలో అగ్నివీరుల పనితీరుతోపాటు, ఇతర కోణాల్లో వారి ప్రతిభను మదింపు చేస్తుంది. ప్రతి బ్యాచ్లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్ కేడర్లోకి తీసుకుంటుంది.
* ఇలా సాధారణ కేడర్లో చేరిన వారు ఉద్యోగ విధివిధానాలకు లోబడి తదుపరి 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. సాధారణ సర్వీసులకు తప్పనిసరిగా ఎంపిక చేయాలని కోరే హక్కు అగ్నివీరులకు ఉండదు. ఈ ఎంపిక పూర్తిగా సైన్యం పరిధిలోని అంశం.
* అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో వైద్య విభాగం మినహా రెగ్యులర్ కేడర్లో సైనిక నియామకం అగ్నివీరులుగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న వారి ద్వారానే జరుగుతుంది.
* అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేసే కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా, ఇతర ప్రయోజనాలు ఉండవు.
* అగ్నివీరులు సర్వీసుకాలంలో తమకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం. వారు సైనిక ప్రయోజనాల దృష్ట్యా ఏ బాధ్యతలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక రెజిమెంట్లో నియమితులైన వారిని తర్వాత మరో రెజిమెంట్కు బదిలీ చేయొచ్చు.
* అగ్నిపథ్ కింద చేరేవారికి భిన్నమైన ర్యాంకులు ఇస్తారు.
విద్యార్హతలివీ..
* జనరల్ డ్యూటీ (సాధారణ విధుల) కోసం దరఖాస్తు చేసుకొనే అగ్నివీరుల వయసు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతి 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్ట్లో కనీసం 33% మార్కులు రావాలి. ఏదైనా బోర్డు మార్కులు కాకుండా గ్రేడింగ్ విధానం పాటిస్తున్నట్లయితే అన్ని సబ్జెక్టుల్లో కనీసం ‘డి’ గ్రేడ్ (33% నుంచి 40%) సాధించాలి. మొత్తంమీద ‘సి2’ గ్రేడ్ (45%కి సమానం)తో పాసై ఉండాలి.
* టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు 12వ తరగతి/ ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి సబ్జెక్ట్లో తప్పనిసరిగా 40% మార్కులు వచ్చి ఉండాలి.
క్లర్క్/ స్టోర్కీపర్ టెక్నికల్ (అన్ని విభాగాలు): 12వ తరగతి/ ఇంటర్మీడియట్లో ఏదో ఒక గ్రూప్ (ఆర్ట్స్, కామర్స్, సైన్స్) 60% మార్కులతో, ఒక్కో సబ్జెక్ట్లో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్, మ్యాథ్స్/ అకౌంట్స్/ ఖాతా పుస్తకాల నిర్వహణ (బుక్ కీపింగ్)లో 50% మార్కులు తప్పనిసరి.
* అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10 పాస్ (అన్ని విభాగాలు): 10వ తరగతి పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్లో 33% మార్కులు వచ్చి ఉండాలి.
* అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8 పాస్ (ఆల్ ఆర్మ్స్): 8వ తరగతి సాధారణంగా పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్లో 33% మార్కులు వచ్చి ఉండాలి.
సడలింపులు, బోనస్ మార్కులు
* మాజీ సైనికోద్యోగుల పిల్లలు, యుద్ధ వితంతువుల సంతానానికి కొన్ని విభాగాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలో బోనస్ మార్కులు లభిస్తాయి. ఎన్సీసీ ఎ, బి, సి సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారికి సైతం కొన్ని మార్కులు కలుస్తాయి.
* సైనిక, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఎత్తులో 2 సెంటీమీటర్లు, బరువులో 2 కిలోలు, ఛాతీ కొలతలపరంగా సెంటీమీటరు మేర సడలింపు ఉంటుంది.
* యుద్ధ వితంతువులు దత్తత తీసుకున్న కుమారులు, ఒకవేళ కుమారులు లేకపోతే అల్లుళ్లకూ పైన పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తాయి. సైనికుడు బతికివున్న కాలంలో చేసుకున్న దత్తతకు మాత్రమే ఈ బోనస్ మార్కులు, మినహాయింపులు వర్తిస్తాయి.
నేడు త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీ
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశం కానున్నారు. తొలుత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్తో భేటీ అవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.