తెలుగులో 10 లక్షల వ్యాసాలు
తెలుగు వికీపీడియా బలోపేతం దిశగా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) చేపట్టిన ఇండిక్ వికీ ప్రాజెక్టులో ముందడుగు పడింది. వర్సిటీకి చెందిన పరిశోధకుల ఆధ్వర్యంలో
వికీపీడియా బలోపేతంలో ముందడుగు
ఫలిస్తున్న ట్రిపుల్ ఐటీ కృషి
ఈనాడు, హైదరాబాద్: తెలుగు వికీపీడియా బలోపేతం దిశగా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) చేపట్టిన ఇండిక్ వికీ ప్రాజెక్టులో ముందడుగు పడింది. వర్సిటీకి చెందిన పరిశోధకుల ఆధ్వర్యంలో పది లక్షల తెలుగు వ్యాసాలను సిద్ధం చేశారు. వీటిని ప్రధాన వికీపీడియాలో నిక్షిప్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సాంకేతికతను వినియోగించి వ్యాసాలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు సహా వివిధ భారతీయ భాషలలో అందుబాటులోకి రానున్నాయి.
ఏమిటీ ప్రాజెక్టు?
ఆంగ్ల వికీపీడియా 2001లో ప్రారంభం కాగా.. 2003లో తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది. ఆంగ్లంలో 75 లక్షలకుపైగా వ్యాసాలు ఉంటే.. తెలుగులో సమాచారం ఆశించిన స్థాయిలో లేదు. దేశంలో వికీపీడియాను వినియోగిస్తున్న వారిలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ఐటీ పాలక మండలి అధ్యక్షుడు ప్రొ.రాజ్రెడ్డి సూచనల మేరకు వికీపీడియాలో తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మూడేళ్ల కిందట ట్రిపుల్ ఐటీ సంకల్పించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, వికీపీడియా ఫౌండేషన్లు సహకారం అందిస్తున్నాయి. దీనికి వర్సిటీ ప్రొఫెసర్ వాసుదేవవర్మ ముఖ్య పరిశోధకులుగా ఉన్నారు.
తెలుగు, హిందీలలో
ఇండిక్వికీ ప్రాజెక్టులో భాగంగా తొలుత తెలుగు, హిందీ భాషల్లో వ్యాసాలను సిద్ధం చేస్తున్నారు. తెలుగు కోసం tewiki.iiit.ac.in, హిందీ కోసం hiwiki.iiit.ac.in పేరిట శాండ్బాక్సు (ట్రిపుల్ ఐటీ ప్రత్యేక బ్రౌజర్) లను తయారు చేశారు. తెలుగులో ఇప్పటివరకు పది లక్షల వ్యాసాలు పొందుపరిచారు. మరో 20 లక్షల వ్యాసాలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. హిందీలో 3 లక్షల వ్యాసాలు సిద్ధం చేయగా.. మరో 3 లక్షల వ్యాసాలు తీసుకురావాలనేది ప్రణాళిక. ప్రస్తుతం ఆయా వ్యాసాలన్నీ ట్రిపుల్ఐటీ రూపొందించిన శాండ్బాక్సులలోనే అందుబాటులో ఉంటాయి. మరిన్ని మెరుగులద్ది దశల వారీగా ఔత్సాహికులతో ప్రధాన వికీపీడియాలో అప్లోడ్ చేయించేందుకు కసరత్తు జరుగుతోంది.
కళాశాలల్లో వికీ క్లబ్ల ఏర్పాటు
ప్రాజెక్టులో భాగంగా విజ్ఞాన ఆధారిత వ్యాసాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో గ్రామాల, పట్టణాల సమాచారాన్ని పొందుపరిచారు. భవిష్యత్తులో యువతను ఎక్కువగా భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో వికీ క్లబ్లు ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటివరకు అయిదు క్లబ్లను ప్రారంభించగా.. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
12 భారతీయ భాషల్లో సిద్ధం చేస్తున్నాం
ప్రస్తుతం మేం తయారు చేసిన ఇండిక్ వికీ ప్రాజెక్టులోని వ్యాసాలు ప్రధాన వికీపీడియాకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం వనరుగా మాత్రమే ఉపయోగపడతాయి. మేం తయారు చేసిన వ్యాసాలకు సవరణలు చేసి ప్రధాన వికీపీడియాలో అప్లోడ్ చేయవచ్చు. తెలుగు, హిందీతోపాటు 12 భారతీయ భాషలలో వ్యాసాల తయారీ ప్రక్రియ నడుస్తోంది. ఎన్ఎల్పీ సాంకేతికతతో దోషాలు లేకుండా వ్యాసాలు సిద్ధం చేశాం. మున్ముందు వివిధ రంగాల నిపుణులతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉంది.
- ప్రొ.వాసుదేవవర్మ, ముఖ్య పరిశోధకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.