కుక్కలున్నాయ్.. పిక్కలు జాగ్రత్త
రాష్ట్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్(ఐపీఎం)కు రోజూ సుమారు 400 మంది కుక్కకాటు బాధితులు యాంటీ రేబిస్ సూది మందు కోసం వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్లోనే 6.5 లక్షల శునకాలు..
వీధుల్లో పదుల సంఖ్యలో సంచారం
11 నెలల్లో బాధితులు 1.68 లక్షలు
ప్రైవేటులో చికిత్స పొందిన వారి సంఖ్య అదనం
గ్రామీణ ప్రాంత ప్రజలకు కోతులు, పాముల బెడద కూడా..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్(ఐపీఎం)కు రోజూ సుమారు 400 మంది కుక్కకాటు బాధితులు యాంటీ రేబిస్ సూది మందు కోసం వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యశాఖ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబరు వరకూ 1,68,367 మంది కుక్కకాటుకు గురవడం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రైవేటుగా చికిత్స పొందిన వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుందనేది అంచనా. రాష్ట్రం మొత్తమ్మీద అత్యధిక కుక్కకాటు కేసులు హైదరాబాద్(17,361)లోనే నమోదయ్యాయి. వైద్యఆరోగ్యశాఖ అంచనా ప్రకారం.. బాధితుల్లో పెంపుడు కుక్కల కారణంగా 29 శాతం మంది, వీధి కుక్కల దాడుల్లో 71 శాతం మంది గాయపడ్డారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలతోపాటు కోతుల బాధితుల సంఖ్యా పెరిగిపోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వీటి కారణంగా గాయపడి చికిత్స పొందినవారు సుమారు 2 లక్షలకు పైగా ఉన్నారు. పాము కాటు కేసులూ ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి.
నియంత్రణ చర్యలేవి?
వీధికుక్కల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా..నిరోధించడంలో పురపాలికలు, పంచాయతీలు విఫలమవుతున్నాయనే విమర్శలున్నాయి. వాటిని పట్టుకునే సుశిక్షితులైన సిబ్బంది కొరతా వేధిస్తోంది. ఒప్పంద పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని, వారికి శిక్షణ ఇప్పించుకోవాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. శునకాలను బంధించి తీసుకెళ్లే వాహనాలూ అరకొరగానే ఉన్నాయి. ఇక సంతాన నియంత్రణ చర్యలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే తాజా లెక్కల ప్రకారం సుమారు 6.5 లక్షల కుక్కలున్నట్లు అంచనా. వీటికి ఎప్పటికప్పుడు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించకపోవడంతో వాటి సంతతి అంతకంతకూ పెరుగుతోంది. ‘తగినంత సిబ్బంది, పరికరాలు లేని కారణంగా 20 శాతం వాటికీ శస్త్ర చికిత్సలు చేయలేకున్నామ’ని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
రేబిస్ ఉన్న కుక్కల లక్షణాలు
* సాధారణంగా అవి ఒంటరిగా ఉంటాయి.
* చొంగ కారుస్తుంటాయి.
* కళ్లు తేలేస్తుంటాయి.
* నీళ్లంటే భయపడుతుంటాయి.
* వాటికి ఎదురుగా ఏదీ కనబడదు.
అందుబాటులో ఉచిత మందులు
కుక్క, పాము కాటు మందులను ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహా అన్ని స్థాయుల ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.4,14,79,142 విలువైన 1,20,405 డోసుల యాంటీ రేబిస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.19,91,574 విలువైన 9,147 డోసుల పాముకాటు ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయి.
గాయానికి కట్టు కట్టొద్దు
-డాక్టర్ ఎంవీ రావు, సీనియర్ జనరల్ ఫిజీషియన్
రేబిస్ వైరస్ నాడీ మండలంపై దుష్ప్రభావం చూపుతుంది. మెదడును వాపునకు గురిచేస్తుంది. ఫలితంగా వ్యక్తి ప్రాణాపాయంలో పడతాడు. కుక్క కరవగానే అది పెంపుడిదా? కాదా? అనేది గుర్తించాలి. పెంపుడిది అయితే యాంటీ రేబిస్ టీకా వేయించారో, లేదో తెలుసుకోవాలి. టీకా వేయించి ఉంటే ఆందోళన అక్కర్లేదు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు, ప్రేరేపణలు లేకపోయినా కరిస్తే అది పిచ్చిదని అనుమానించాలి. అలాంటివి కరిస్తే ఆ గాయాన్ని ధారగా కారే మంచినీటిలో శుభ్రపర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీ సెప్టిక్ లోషన్లు, క్రీములను పూతగా వాడొద్దు. ఉప్పు, పసుపు వంటి వాటిని పోయొద్దు. ఆ గాయాన్ని తెరిచే ఉంచాలి. తీవ్ర రక్తస్రావం లేకపోతే కుట్లు వేయడం, కట్లు కట్టడం వంటివీ చేయకూడదు. కరిచిన వెంటనే, లేదా అదే రోజు యాక్టివ్ ఇమ్యునైజేషన్ టీకాను ఇప్పించాలి. నిర్దేశిత డోసుల టీకాను తీసుకున్నప్పటికీ పాసివ్ ఇమ్యునైజేషన్ టీకాను తప్పకుండా ఇప్పించాలి. దీన్ని గాయం ఉన్న చోటే వేస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాముకాటు కేసులు: 4,895
అత్యధికం: మహబూబ్నగర్ జిల్లాలో (629)
విష సర్పమైతే రెండు కాట్లు
పాము కరిచిందనే సందేహం వచ్చినప్పుడు, పక్కనున్న వ్యక్తులు ధైర్యం చెప్పడం కీలకం. కరిచింది విష సర్పమా? సాధారణమైనదా? అనేది మొదట గుర్తించాలి. విషసర్పమైతే సూదితో గుచ్చిన మాదిరిగా రెండు చోట్ల కోరల తాలూకూ గుర్తులు, రక్తపు చుక్కలు కనిపిస్తాయి. అలాంటివి గుర్తిస్తే సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సాధారణ పాము అయితే కాట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
సత్వర చికిత్సతో రక్షించొచ్చు
-డాక్టర్ కత్తి జనార్దన్, ప్రోగ్రాం అధికారి, రంగారెడ్డి జిల్లా
నాగుపాము, కట్ల పాము కాటేసినప్పుడు ప్రధానంగా శ్వాస, నాడీ, గుండె వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. సకాలంలో చికిత్స పొందకపోతే శ్వాస ఇబ్బందులు ఎదురై, నాడీ వ్యవస్థ దెబ్బతిని గుండె ఆగిపోతుంది. రక్తపింజర కాటేసినప్పుడు రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తుంది. వీరికి ‘పాము కాటు విరుగుడు మందు(యాంటీ స్నేక్ వీనమ్)’ ఇంజక్షన్ను ఇస్తే ప్రాణాపాయం తప్పుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.