విమర్శలు గొప్పకాదు.. పనులు చేయడం కష్టం
రాజకీయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు. నోటికి వచ్చినట్లు దూషణలు చేయడం గొప్పపని కాదు.
గంభీరావుపేటలో ‘కేజీ నుంచి పీజీ’ ప్రాంగణానికి జయశంకర్ పేరు
మన ఊరు- మన బడి ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి, న్యూస్టుడే, గంభీరావుపేట: రాజకీయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు. నోటికి వచ్చినట్లు దూషణలు చేయడం గొప్పపని కాదు. కానీ పనులు చేయడం కష్టమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టు పీజీ విద్యాలయాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేయాలంటే చాలా కష్టమని, ఈ కష్టాలన్నింటినీ తట్టుకుంటూ తాము పనులు చేస్తున్నామని చెప్పారు. 2004లో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీ నేటికి కార్యరూపం దాల్చిందన్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో భాగంగా మన ఊరు- మన బడి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్రమాణాలతో, ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నెలకొల్పినట్లు చెప్పారు. మన ఊరు-మన బడి కింద మూడు దశల్లో విద్యా సంస్థలు, వ్యవస్థను సంస్కరించాలనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గంభీరావుపేట ప్రాంగణంలో మంచి గ్రంథాలయం, స్కిల్ నాలెడ్జ్సెంటర్, ఇతరత్రా విద్యాసముపార్జన కేంద్రాలు చూశాక సీఎం కేసీఆర్తో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ గుర్తుకువచ్చారన్నారు. రాష్ట్రంలోని మొట్టమొదటి కేజీ నుంచి పీజీ విద్యాసంస్థగా నిర్మితమైన ఈ ప్రాంగణానికి జయశంకర్ పేరు పెట్టాలని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని కోరారు. దీనిని అందంగా తీర్చిదిద్దడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంకేత్ కొండూరిని ఆయన సత్కరించారు.
దేశంలోనే మొదటి క్యాంపస్: మంత్రి సబిత
దేశంలో ప్రభుత్వపరంగా కేజీ నుంచి పీజీ వరకు క్యాంపస్లు ఎక్కడా లేవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒక విజన్తో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ స్ఫూర్తితో మిగిలిన జిల్లాల్లోనూ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,300 కోట్లతో 26 వేల పాఠశాలలు ఎంపిక చేశామని, మొదటి విడతగా రూ.3,500 కోట్లు కేటాయించి 9 వేల పాఠశాలలను తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన 680 పాఠశాలలను ఈ పథకం ద్వారా అభివృద్ధి చేసి సకల వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యాసౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలల ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: మన ఊరు- మన బడి కార్యక్రమం-తొలి విడత కింద పనులు పూర్తయి.. కొత్త రూపు సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సుమారు 680 బడులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేడుకలా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులతోపాటు గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొని కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని ప్రారంభించారు.హైదరాబాద్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మూడు పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. బడ్జెట్ రూపకల్పన, ఇతర పనుల్లో బిజీగా ఉన్నందున ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హాజరుకాకపోవడంతో సిద్దిపేట నియోజకవర్గంలో బడులు ప్రారంభం కాలేదు.
రెండో విడత 9,123 బడులు... రూ.2,516 కోట్లు
రాష్ట్రంలో మొత్తం 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో తొలి విడతలో అధిక విద్యార్థులున్న 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో 12 రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. రెండో విడతలో అంతేసంఖ్యలో ఉన్న బడుల్లో వసతుల కోసం రూ.2,516 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక మూడో విడతలో 7,819 పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.1,275 కోట్లు వ్యయం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.