పేదల చెంతకు వైద్యవిద్య
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం వైద్యకళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచడం వల్ల 5,540 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి.కరుణాకర్రెడ్డి తెలిపారు.
గత పదేళ్లలో ఎంబీబీఎస్ సీట్లు 2,850 నుంచి 8,390కి చేరాయి
కొత్త కళాశాలలు రావడంతో మారుమూల ప్రాంతాలకు వైద్యం
‘ఈనాడు’తో కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ బి.కరుణాకర్రెడ్డి
ఈనాడు, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం వైద్యకళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచడం వల్ల 5,540 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి.కరుణాకర్రెడ్డి తెలిపారు. దీంతో అందరికీ వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలో ఒప్పందం గడువు ఈ ఏడాది ముగుస్తుండటంతో.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంధ్రాకు కేటాయిస్తున్న మరో 300 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, సీట్ల పెంపుదల వల్ల విద్యార్థులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, పదేళ్లలో కాళోజీ వర్సిటీ సాధించిన విజయాలపై ‘ఈనాడు’తో ఉపకులపతి ముఖాముఖి.
దేశంలోనే అత్యధికంగా...
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు కళాశాలలు ఉండేవి. నేడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే వేళ ఏకంగా 26 ప్రభుత్వ, 28 ప్రైవేటు కళాశాలలు వచ్చాయి. అప్పుడు ఎంబీబీఎస్ సీట్లు 2,850, పీజీ 1,183 ఉండగా, ఇప్పుడు ఎంబీబీఎస్లో 8,390, పీజీలో 2,716కు చేరాయి. మహబూబాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం లాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు వల్ల నిరుపేదలకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చింది. మారుమూల జనాలకు వైద్యసేవలు అందించాలనే దూరదృష్టితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ సంఖ్యలో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయించారు. వీటివల్ల ఉద్యోగాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. వైద్యవిద్య కోసం విద్యార్థులు ఉక్రెయిన్, రష్యా, చైనా తదితర దేశాలకు వెళ్లే పాట్లు తప్పాయి. మన దగ్గర లక్ష మంది జనాభాకు 22 వైద్య సీట్లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. వైద్య విద్యలో 10 శాతం గిరిజనులకు రిజర్వేషన్ అమలుచేస్తున్నాం. మైనారిటీ విద్యార్థులకు ఎక్కువ సీట్లు ఇస్తోంది తెలంగాణ రాష్ట్రమే.
వచ్చే ఏడాది నుంచి..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని ఎంబీబీఎస్, పీజీ సీట్లలో ఆంధ్రా విద్యార్థులకు సుమారు 300 సీట్లు కేటాయించాం. ఈ ఏడాదితో పదేళ్ల రిజర్వేషన్ నిబంధన ముగియనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మన విద్యార్థులకు ఈ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. విజయవాడలో ఒక్క కళాశాలలో మన విద్యార్థులకు 30 సీట్ల వరకు వచ్చేవి. వచ్చేఏడాది నుంచి అవి అందుబాటులో ఉండవు. యునాని, ఆయుర్వేద, నేచురోపతి లాంటి కోర్సుల్లోనూ సైతం వచ్చే ఏడాది వందల సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. వైద్యరంగం అవసరాలకు తగ్గట్టు కాళోజీ వర్సిటీ ప్రభుత్వ కళాశాలల్లోనే 14 వైద్య అనుబంధ కోర్సులు(అలాయిడ్) ఉన్నాయి. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్తోమెట్రీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో థెరపీ.. ఇలా కొత్త కోర్సులు రావడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తమిళనాడు, కేరళ తర్వాత మెరుగైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం గర్వకారణం.
డిజిటలైజేషన్ హెల్త్ వర్సిటీగా గుర్తింపు
కాళోజీ వర్సిటీ.. తొలి డిజిటలైజేషన్ హెల్త్ వర్సిటీగా గుర్తింపు పొందింది. మూల్యాంకనం సైతం ఫేస్ రికగ్నైజేషన్తో ఆన్లైన్లోనే జరిగేలా సాఫ్ట్వేర్ రూపొందించాం. అన్ని అవసరాలకు ప్రభుత్వంపై ఆధారపడకుండా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ను సిద్ధంచేశాం. కొత్తగా ఏర్పాటైన కళాశాలలన్నింటికీ కలిపి ఒక్కచోట రూ.15 లక్షలు వెచ్చించి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక్క గాంధీలోనే డిజిటల్ క్లాస్రూం ఉండేది. ఉస్మానియా, గాంధీ, కేఎంసీ ఏదో ఒక్క పెద్ద కళాశాలలో నిపుణులైన వైద్యులు పాఠాలు బోధించినా అందరూ వినేలా, అరుదైన రోగులు వచ్చినప్పుడు వారి కేస్ స్టడీస్ను మిగతా కళాశాలల విద్యార్థులకు బోధించి చికిత్స విధానం తెలుసుకునేలా ఈ సదుపాయం కల్పిస్తున్నాం. వర్సిటీ కోసం అత్యాధునిక భవనం నిర్మించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.