న్యాక్లో గ్రేడింగ్ ఉండదు!
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు, మదింపు కమిటీ(న్యాక్) గ్రేడింగ్లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ ఇటీవల పలు సంస్కరణలకు సిఫార్సు చేసింది.
ఇకపై 3 రకాల విధానం
గుర్తింపు పొందినవి, పొందనివి, గుర్తింపునకు దగ్గరలో ఉన్నవి
కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు, మదింపు కమిటీ(న్యాక్) గ్రేడింగ్లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ ఇటీవల పలు సంస్కరణలకు సిఫార్సు చేసింది. వచ్చే డిసెంబరు నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రోడ్మ్యాప్ అందజేసింది. వచ్చే రెండు నెలల్లో కేంద్రం దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ సహస్రబుద్దే ‘ఈనాడు’తో మాట్లాడుతూ చెప్పారు.
సమ్మిళిత అక్రిడిటేషన్...
ప్రస్తుతం 4 పాయింట్లకుగాను ఆయా విద్యాసంస్థలు పొందిన పాయింట్ల ఆధారంగా ఎనిమిది రకాల గ్రేడ్లు ఇస్తున్నారు. ఏ ++, ఏ +, ఏ, బీ++, బీ+, బీ, సి, డి గ్రేడ్లు ఉన్నాయి. డి అంటే గుర్తింపు పొందలేదని అర్థం. ఇక నుంచి అక్రిడిటేషన్కు ‘మూడు రకాల’ విధానం ఉంటుంది. విద్యా సంస్థల్ని గుర్తింపు దక్కించుకున్నవి, గుర్తింపు పొందటానికి దరిదాపులో ఉన్నవి, గుర్తింపు పొందనివిగా పరిగణిస్తారు. ప్రస్తుతం విద్యాసంస్థల వారీగా న్యాక్... ఆయా బ్రాంచీల వారీగా నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఇస్తోంది. వాటన్నింటిని మిళితం చేసి ఒకటే అక్రిడిటేషన్ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఆరు కేటగిరీలుగా విద్యాసంస్థలు
విద్యాసంస్థలను ఆరు కేటగిరీలుగా విభజిస్తారు. అవి.. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంటెన్సివ్; పరిశోధన; విద్యాబోధన; స్పెషలైజ్డ్ కోర్సులున్నవి; ఒకేషన్ అండ్ స్కిల్ ఇంటెన్సివ్; కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని విద్యాసంస్థలను బహుళ కోర్సుల విద్య, పరిశోధనా సంస్థలుగా మార్చేందుకు ప్రయత్నిస్తారు.
ఒక దేశం - ఒక డేటా
ఇక నుంచి ఒక దేశం - ఒక డేటాను అమలు చేస్తారు. విద్యా సంస్థలు ఏ సమాచారమైనా ఆ పోర్టల్కు పంపించాలి. ఆయా కేంద్ర సంస్థలు దాని నుంచి డేటాను స్వీకరించి అక్రిడిటేషన్ ఇస్తాయి.దీనిపై హెచ్సీయూ సీనియర్ ఆచార్యుడు బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ ఇలా చేస్తే విద్యాసంస్థలపై భారం తగ్గుతుందని, విద్యాపరమైన వ్యవహారాలపై ఆచార్యులు దృష్టి పెట్టడానికి వీలవుతుందన్నారు.
ముఖ్య సిఫార్సులు ఇలా...
- ప్రస్తుతం ఐఐటీలు న్యాక్ గుర్తింపు పొందటం లేదు. ఇక నుంచి అవి కూడా జాతీయ అక్రిడిటేషన్ విధానంలోకి రావాలి.
- విద్యాసంస్థలు ఇచ్చే సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. దానివల్ల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం తప్పు అయితే ఫిర్యాదులు వస్తాయి. సమాచారం తప్పని రుజువైతే భారీ జరిమానా విధిస్తారు.
- అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఏటా విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని విరమించుకోవాలి.
- తొలిసారి అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మరీ కఠినంగా వ్యవహరించకుండా ప్రోత్సహించేలా ఉండాలి. ప్రస్తుతం అక్రిడిటేషన్ను అయిదేళ్లకు ఇస్తుండగా ప్రతి మూడేళ్లకు ఇవ్వాలి.
- సంస్థలకు గుర్తింపు ఇచ్చేముందు విద్యార్థుల అభిప్రాయాలను మాత్రమే న్యాక్ పరిగణనలోకి తీసుకుంటోంది. ఇక నుంచి నిధులిచ్చే సంస్థలు, పరిశ్రమల అభిప్రాయాలనూ తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా