కవితకు 15 రోజుల రిమాండ్
దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్ రిమాండ్ కోరారు.
రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఉత్తర్వులు
కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి
కవిత దరఖాస్తు.. విచారణ వాయిదా
తిహాడ్ జైలుకు తరలింపు
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. అందుకు న్యాయమూర్తి కావేరీ బవేజా అంగీకరించారు. ‘‘ఈ కేసులో నిందితురాలి పాత్రపై దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉంది. అక్రమార్జనను వెలికితీయడంతోపాటు ఇందులో భాగస్వాములైనవారు, నేరపూరిత ఆర్జనకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిని గుర్తించే పని కొనసాగుతోందని, ఇది ఆర్థిక నేరం కావడం వల్ల సాధారణ నేరాల కంటే సంక్లిష్టంగా ఉంటుందని ఈడీ చేసిన వాదనలను దృష్టిలో ఉంచుకొని ఆమెను ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు నిందితురాలిని కోర్టు ముందు హాజరుపరచాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్న కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత పెట్టుకున్న దరఖాస్తుపై అభిప్రాయం చెప్పడానికి ఈడీకి ఏప్రిల్ 1 వరకు గడువు ఇచ్చారు. ఆ ప్రతిని నిందితురాలి న్యాయవాదికి ముందస్తుగా అందించాలని ఆదేశించారు.
‘ప్రధాన కుట్రదారు, లబ్ధిదారు కవితే’
ఈ సందర్భంగా ఈడీ తరఫున హాజరైన ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ ‘‘ప్రస్తుతానికి నిందితురాలిని 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరుతోంది. అయితే సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను అనుసరించి నిందితురాలిని ఆ తర్వాత కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరే హక్కును రిజర్వ్లో ఉంచుకుంటోంది. దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కవితే. సౌత్ గ్రూప్లోని ఇతర సభ్యులతో కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నాయకులతో కుట్ర పన్ని రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారు. అందుకు ప్రతిఫలంగా మద్యం విధానంలో అనుచిత ప్రయోజనాలు పొందారు. ఈమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.
మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయవాదుల వినతి
కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌధరి వాదనలు వినిపిస్తూ ‘‘పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19(2)లోని నిబంధనలను అనుసరించి అన్ని రికార్డులను భద్రపర్చడంతో పాటు మాకు అందుబాటులో ఉంచేలా ఆదేశించాలి. కస్టడీలో ఉన్న సమయంలో ఆమె మెడికల్ రికార్డులను అందించాలి’’ అని కోరారు. బెయిల్ అభ్యర్థనపై వేగంగా నిర్ణయం వెల్లడించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. మరో న్యాయవాది నితేశ్ రాణా వాదనలు వినిపిస్తూ నిందితురాలి మైనర్ కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆమె వైద్య నివేదికలు అందించడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్పై ఈడీ అభిప్రాయం చెప్పడానికి కనీసం వారం గడువు ఇవ్వాలని కోరారు. నిందితురాలి అరెస్టు విషయంలో పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) కింద పొందుపరిచిన నిబంధనలన్నింటినీ ఈడీ అధికారులు అనుసరించినట్లు 16వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ కోర్టు పేర్కొందని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ వాదనలతో న్యాయమూర్తి కావేరీ బవేజా ఏకీభవించారు. ‘‘నిందితురాలు, ఈడీ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నాను. సెక్షన్ 19(2) ప్రకారం అరెస్టు ఉత్తర్వులు, తమ వద్ద ఉన్న ఇతర సామగ్రిని దర్యాప్తు సంస్థ అధికారులు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించడం తప్పనిసరి. వాటి ప్రతులను నిందితులకూ అందించాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అందువల్ల కోర్టుకు సమర్పించిన రికార్డులను తమకూ అందించాలని నిందితురాలి తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇంటి భోజనానికి అనుమతి
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలని, దీంతోపాటు పరుపు, స్లిప్పర్లు, దుస్తులు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, పుస్తకాలు, పెన్ను, కాగితాలు అందించాలని, బంగారు నగలు ధరించడానికి, ఔషధాలు తీసుకెళ్లడానికీ అనుమతివ్వాలన్న కవిత విజ్ఞప్తిని న్యాయమూర్తి మన్నించారు. వాటన్నింటినీ అనుమతించాలని తిహాడ్ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం కవితను సాయంత్రం తిహాడ్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఆరో నంబరు జైలులో ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఆమెను ప్రత్యేక సెల్లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఈడీ ముందుకు మేకా శరణ్
దిల్లీ మద్యం కేసులో కవిత తరఫున ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తున్న ఆమె మేనల్లుడు మేకా శరణ్ మంగళవారం ఈడీ అధికారుల ముందు హాజరైనట్లు తెలిసింది. ఈ నెల 23న ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన కవిత రిమాండ్ పొడిగింపు అప్లికేషన్లో ఈడీ ఈయన పాత్ర గురించి ప్రస్తావించింది. విచారణకు పిలిచినా రాలేదని తెలిపింది. అదేరోజు అతని ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో శరణ్ మంగళవారం హాజరైనట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు
కడిగిన ముత్యంలా బయటికొస్తా
కవిత వ్యాఖ్యలు
ఈనాడు, దిల్లీ: తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకొస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు మాత్రమే. ఒక నిందితుడు ఇప్పటికే భాజపాలో చేరారు. రెండో నిందితుడు భాజపా టికెట్ దక్కించుకుంటున్నారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.50 కోట్లు ఇచ్చారు. ఇది కుట్రపూరితంగా నమోదు చేసిన తప్పుడు కేసు. ఈ చట్టవిరుద్ధమైన కేసుపై పోరాడతా. నిర్దోషిగా.. కడిగిన ముత్యంలా బయటికొస్తాను’’ అని కవిత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.