నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు

నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్‌రావు మృతి చెందిన విషయం తెలిసిందే.

Published : 20 Apr 2024 04:39 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్‌రావు మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శుక్రవారం నల్గొండ టూటౌన్‌ ఎస్సై నాగరాజు రఘుబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసును పరిశీలించిన మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని