అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలి
సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బయోమెన్యూర్, బయోమాస్కు సంబంధించిన యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చేనెల పరిశ్రమల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, జౌళిశాఖల్లో ఒకే విధమైన పనికలిగిన కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్గా చేసి బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పదవీ కాలం ముగిసిన సహకార సంఘాలకు, పదేళ్లుగా పాలకవర్గాలు లేని హౌసింగ్ సొసైటీలకు వెంటనే సీఎం అనుమతితో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, జౌళిశాఖ సంచాలకురాలు అలుగు వర్షిణి, ఉద్యానశాఖ సంచాలకులు అశోక్రెడ్డి, మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి, పరిశ్రమలశాఖ డైరెక్టర్ మల్సూరుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటులో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవసరమైన ప్రోత్సాహం అందించాలన్నారు.
ఎన్ఏసీ ఉంటేనే ప్రైవేటుకు..
‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు టెస్కో ద్వారా తప్పనిసరిగా వస్త్రాలు కొనుగోలు చేయాలి. ఇప్పటికే టెస్కోకు రూ.255 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. టెస్కో నుంచి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్(ఎన్ఏసీ) పొందిన తరువాతే ప్రైవేటు మార్కెట్లో టెండర్లకు ఆర్డర్లు ఇవ్వాలి. చేనేత రంగ పరిశ్రమల ఆధునికీకరణ కోసం రూ.350కోట్లు కేటాయించి నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు జరిగేలా చూడాలి. ఏటా బతుకమ్మ చీరలతో కలిపి 5.7కోట్ల మీటర్ల ఆర్డర్లు నేత కార్మికులకు వచ్చేవి. ఈ ఏడాది అదనంగా మరో 2.5 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయి.
మరో 80లక్షల మీటర్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు త్వరగా చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పవర్లూమ్స్ పరిశ్రమకు విద్యుత్తు సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ద్వారా శానిటరీ నాప్కిన్ యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి. పాఠశాల విద్యార్థినులకు విద్యాశాఖ ద్వారా నాప్కిన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. గోదాములపై సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పొందడంతోపాటు ప్యానెళ్ల ఏర్పాటుకు ఖర్చు అంచనా వేసుకోవాలి. విద్యుత్తుశాఖ కలిసి ఒప్పందాలు చేసుకోవాలి. ఖమ్మం మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించడంతోపాటు కోహెడ నుంచి పండ్లను అంతర్జాతీయంగా ఎగుమతులు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని అధికారులను తుమ్మల ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం
మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను భావితరాలు గుర్తుంచుకునేలా వారి విగ్రహాలను ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం సర్వసాధారణమే. -
సైబర్ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?
ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. -
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్ మందుల వాడకం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్లోని సైన్ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ను రూపొందించాయి. -
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
హైదరాబాద్ లోటస్ పాండ్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నివాసం ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం.. ఓ అధికారి బదిలీకి దారితీసింది. -
పట్టాలెక్కని ప్రాజెక్టులు
రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి. -
వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సిట్ చేతికి సాంకేతిక ఆధారాలు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
జనం సొమ్ముతో... జగన్ మాయామహల్
అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం..! అయితే... -
నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట
వర్షాలు మొదలుకాగానే దోమల తాకిడి పెరుగుతుంది. వీటి బెడదను వదిలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. -
జాలిపడేలా కాదు.. ఈర్ష్యపడేలా ఎదగాలన్న రామోజీరావు
జాలిపడేలా కాకుండా ఎదుటివారు ఈర్ష్యపడేలా ఎదగాలన్న జీవిత సత్యాన్ని చెప్పి.. ఆచరించి చూపిన స్ఫూర్తిప్రదాత రామోజీరావు అని సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. -
రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు: ఈటల
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అరుదైన వ్యక్తి అని.. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని భాజపా ముఖ్య నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. -
భక్తజనంతో మురిసిన బాసర
దశమి, ఏకాదశి కలిసి రావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. -
పాస్బుక్లు, రేషన్కార్డులున్న వారికే రుణమాఫీ!
పంద్రాగస్టులోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
అధికారులను అవమానిస్తున్న కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి
జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం డిమాండ్ చేసింది. -
నేర చరిత్ర ఉన్నవారిని పనుల్లో పెట్టుకోకూడదు: మంత్రి శ్రీధర్బాబు
వలస కూలీల నియామకాల్లో పరిశ్రమల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. -
మేడిగడ్డలో భారీగా ఇసుక పూడిక
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. -
ఎస్సైలుగానే పుష్కరకాలం!
పోలీసుశాఖలో పదోన్నతుల ప్రక్రియ తరచూ చర్చనీయాంశమవుతోంది. నిన్నమొన్నటి వరకు పాత జోన్ల మధ్య వివాదాలు తలెత్తగా... ఇప్పుడు కొత్తగా మల్టీజోన్లు ఏర్పాటైనా వీటికి పరిష్కారం కనిపించడంలేదు. -
ఆగస్టులో ‘ఫాక్స్కాన్’ ఉత్పత్తులు షురూ!
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’ సంస్థ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఉత్పత్తులను ప్రారంభించనుంది. -
తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డా.బి.వి.పట్టాభిరాం
తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డాక్టర్ బి.వి.పట్టాభిరాం అని పలువురు వక్తలు కొనియాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం
-
Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
-
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
-
నా భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతోంది : వితిక
-
రుషికొండ ప్యాలెస్లో బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి: మంత్రి నారా లోకేశ్
-
దర్శన్పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?