రేపటిలోగా పంట నష్టపరిహారం

రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Published : 06 May 2024 06:24 IST

నేరుగా రైతుల ఖాతాల్లో జమ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో మొత్తం 15,814 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదించగా.. ఎకరానికి రూ.పది వేల చొప్పున 15,246 మందికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.15.81 కోట్లు మంజూరు చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి ప్రభుత్వం అనుమతి కోరింది. ఈసీ అనుమతించడంతో పరిహారం పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని