రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
నేరుగా రైతుల ఖాతాల్లో జమ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో మొత్తం 15,814 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదించగా.. ఎకరానికి రూ.పది వేల చొప్పున 15,246 మందికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.15.81 కోట్లు మంజూరు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి ప్రభుత్వం అనుమతి కోరింది. ఈసీ అనుమతించడంతో పరిహారం పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-విజయవాడ రహదారి దిద్దుబాటు పనులు చేపట్టండి
‘హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిద్దుబాటు పనులను వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఆనంద్ సినీ సర్వీసెస్కు భూకేటాయింపు సబబే
రాజధాని హైదరాబాద్లోని షేక్పేట సర్వే నం.403లో 5 ఎకరాలను ఆనంద్ సినీ సర్వీసెస్కు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. -
ఆస్తుల పంపిణీలో అంతులేని జాప్యం!
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. -
12లోగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయండి: సీఎస్
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. -
ఇకపై తప్పనిసరిగా ‘టీజీ’ అనే రాయాలి
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వతంత్ర సంస్థలు తెలంగాణ సంక్షిప్త పదాన్ని తప్పనిసరిగా ‘టీఎస్’ బదులుగా ‘టీజీ’ అని రాయాలని ఆదేశిస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పీజీఈసెట్ తేదీల్లో మార్పు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్) నిర్వహణ తేదీలు మారాయి. -
ధ్రువపత్రాల అటెస్టేషన్లో గుర్తింపు లేని ఏజెన్సీల మోసాలు
విదేశాలకు వెళ్లే వారి ధ్రువపత్రాల అటెస్టేషన్ లేదా అపొస్టిల్ చేయించడానికి కొన్ని గుర్తింపులేని ఏజెన్సీలు ఇష్టానుసారం డబ్బులు దండుకుంటున్నాయి. -
అలసట తీర్చుతూ.. సమయానికి నిద్ర లేపుతూ..
ఉద్యోగులు కాసేపు నిద్రపోతే విధులు మరింత సమర్థంగా నిర్వహిస్తారనే ఆలోచనతో కొన్నేళ్ల క్రితమే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల్లో నిద్రపోవడానికి ఏర్పాట్లు చేశాయి. -
వెబ్సైట్లో ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్లు
ఈ నెల 24 నుంచి మొదలయ్యే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు