ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి.
ఎన్సీటీఈ తెలిపిందన్న యూఎస్పీసీ, జాక్టో
లేఖ వివరాలు వెల్లడించని శ్రీదేవసేనపై చర్యలకు డిమాండ్
హైదరాబాద్, న్యూస్టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్ కుమార్, పి.నాగిరెడ్డి, టి.లింగారెడ్డి, యు.పోచయ్య, జి.సదానందం గౌడ్, ఎం.పర్వతరెడ్డి, ఎం.రాధాకృష్ణ, కె.కృష్ణుడు తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదని, పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే ఇది అవసరమని ఏప్రిల్ 8న ఎన్సీటీఈ రాష్ట్రానికి వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈనెల 3 న దిల్లీలో ఎన్సీటీఈ మెంబర్ సెక్రటరీ శెర్పాతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూఎస్పీసీ, జాక్టో ప్రతినిధులు సమావేశమైనప్పుడు ఏప్రిల్ 8నే పాఠశాల విద్యా కమిషనర్కు మెయిల్ ద్వారా వివరణ లేఖ పంపినట్లు తెలిసిందన్నారు. ఆ వివరాలు వెల్లడించకుండా ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేసిన శ్రీదేవసేన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు ఎన్సీటీఈ నిబంధనలు పాటించాలని గత సెప్టెంబరు 29న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా అన్ని క్యాడర్ల పదోన్నతులు నిలిపివేశారన్నారు. ఏ క్యాడర్ పదోన్నతులకు ‘టెట్’ అవసరమో ఎన్సీటీఈ నుంచి వివరణ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు అభ్యర్థించిన మీదట ఫిబ్రవరి 14న విద్యాశాఖ కమిషనర్ లేఖ రాశారని వివరించారు. ఎన్సీటీఈ ప్రత్యుత్తరం విషయం తెలియక.. ఏప్రిల్ 20 వరకే గడువు ఉండడంతో టెట్కు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారన్నారు. మరికొన్ని అంశాలపై వివరణ తీసుకొని, ఎన్నికలు ముగిసిన వెంటనే పదోన్నతులు చేపట్టాలని యూఎస్పీసీ, జాక్టో ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
ఇంకిన నీరు ఇంకినట్లే తోడివేత!
వర్షాలు, నీటివనరుల ద్వారా నేలలో ఇంకే నీటిని ఇంకినట్లే తోడుతున్నారు హైదరాబాద్ జిల్లా వాసులు. 2023 సంవత్సరానికి రాష్ట్రంలో నేలలోకి ఇంకిన నీటి పరిమాణం, తోడివేతపై రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. -
సహకార అధికారులకు న్యాయం చేయాలి
తెలంగాణ సహకారశాఖలో జీతభత్యాల విషయంలో ఆది నుంచీ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని... కొత్త పీఆర్సీలో తమకు పూర్తి న్యాయం చేయాలని సహకారశాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: ప్రొ. హరగోపాల్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బస్తర్, సుకుమా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను తక్షణమే నిలిపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కొలిక్కిరాని ధరణి పెండింగ్ సమస్యలు
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. -
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ (షట్టరింగ్ కార్పెంటర్స్), సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. -
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. -
ఎన్నికల సమయంలో నగదు జప్తు సబబే
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది అక్టోబరులో మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల నగదు విడుదలకు, దాని ఆధారంగా నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. -
ధాన్యం టెండర్లలో అక్రమాలు.. పెద్ది సుదర్శన్రెడ్డి
గ్లోబల్ టెండర్ల పేరుతో జరిగిన ధాన్యం అమ్మకాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని భారాస మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు