Published : 08/03/2023 00:35 IST

దూసుకుపోతున్నారు!

అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు ఉద్యోగాలు దక్కించుకోవటంలోనూ దూసుకుపోతున్నారు. మగవాళ్లని మించి నౌకరీ సాధిస్తున్నారు. ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం ఈ ఏడాది మహిళా ఉద్యోగినుల సంఖ్య 52.8 శాతానికి పెరిగింది. వీరి సంఖ్య వచ్చే ఏడాది నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

న్నాళ్లూ ఇల్లు కొనడంలాంటి కీలక బాధ్యతలు మగవాళ్ల పనే అనుకున్నారా? ఇక నుంచి ఆ అభిప్రాయం మార్చుకోండి. ఎందుకంటే ఈ రెండేళ్ల కాలంలో ఇళ్లు కొనే మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోందని కొటక్‌మహీంద్ర బ్యాంకు వెల్లడించింది. మహిళలు ఉద్యోగాలు చేయడం, ఆర్థిక సాధికారత పెంచుకోవడమే ఇందుకు కారణమట.

ఉద్యోగాల కల్పనలో మహిళలకు సముచిత గౌరవం కల్పించే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే సమున్నత స్థానంలో నిలిచిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. తాజాగా విడుదల చేసిన ఐదో ఎడిషన్‌ ప్రకారం తెలంగాణా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా డిగ్రీలో చేరుతున్నారు. 22-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో 1,46,039 మంది అడ్మిషన్లు పొందగా... అందులో అబ్బాయిలు 67,452 అమ్మాయిలు.. 78,587 మంది ఉన్నారు.

కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగా ఉద్యోగానికి విరామం ఇచ్చినా తిరిగి వృత్తిలో చేరిన వారి సంఖ్య ఆరు శాతం పెరిగింది. నాయకత్వ స్థాయిలో ఉండే  మహిళల సంఖ్య 8శాతానికి పెరిగిందని ఫౌండిట్ అనే నియామక సంస్థ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి