Bakhmut: గులాబీల నగరం.. నెత్తుటి దారుల్లో మునిగిన వేళ..!
పారిశ్రామిక నగరంగా పేరున్న బఖ్ముత్ (Bakhmut) నగరం.. గులాబీల నగరంగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలంగా రష్యా దురాక్రమణకు (Russia Invasion) కేంద్ర బిందువుగా మారిన ఈ నగరం ఇప్పుడు పూర్తిగా నాశనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చేస్తున్న దురాక్రమణతో (Russia Invasion) ఉక్రెయిన్ నగరాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ (Ukraine) బలగాలు మాత్రం రష్యా సేనలను నిలువరిస్తూ తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా పైచేయి సాధించినట్లు రష్యా చెప్పుకుంటోన్న బఖ్ముత్లో (Bakhmut) పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు గులాబీల నగరంగా పేరొందిన ఆ ప్రాంతం ఇప్పుడు భూమి మీద ఉన్న ఓ నరక కూపంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఉక్రెయిన్లో యుద్ధం మొదలుకాక ముందు బఖ్ముత్ (Bakhmut) నగరం జనాభా సుమారు లక్ష మాత్రమే. దొనెత్స్క్ ప్రాంతంలో ఉన్న బఖ్ముత్కా నది ఈ నగరం మీదుగా ప్రవహిస్తుంది. అయితే, ఇది లోయప్రాంతంలో ఉండటం వల్ల శత్రుదేశాలను ఎదుర్కోవడం ఇక్కడ కష్టం. ఒకప్పుడు ఉప్పు తవ్వకాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం రైల్వే హబ్గా ఉంది. నాణ్యమైన వైన్ తయారీకి ఈ నగరం ఎంతో ప్రసిద్ధి. ప్రస్తుతం అదంతా ఒడెసా ప్రాంతానికి తరలిపోయింది. 1924 నుంచి 2016 వరకు ఈ ప్రాంతాన్ని అర్టెమొవస్క్గా పిలిచారు. సోవియట్ విప్లవకారుడికి నివాళిగా దీన్ని ‘ఆర్టెమ్’ అని పిలిచేవారు. అప్పట్లో దీన్ని వైన్, గులాబీల నగరంగా పిలిచేవారు. నగరంలోని ఓ వీధిలో రికార్డుస్థాయిలో దాదాపు 5వేల గులాబీ మొక్కలు ఉండేవట. దాంతో ఆ ప్రాంతం.. గులాబీల వీధి అని ప్రసిద్ధి చెందింది.
అంతా శిథిలమై..
పారిశ్రామిక నగరంగా పేరున్న ఈ గులాబీల నగరం కొంతకాలంగా రష్యా దురాక్రమణకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్చి నాటికి అక్కడ 3వేల మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు స్థానిక అధికారుల అంచనా. సుమారు ఎనిమిది నెలలుగా జరుగుతోన్న భీకర దాడులతో నగరం ప్రస్తుతం పూర్తిగా నాశనమయ్యింది. ఎక్కడ చూసినా శిథిల భవంతులే. ఫిరంగుల మధ్య కుప్పకూలిన నిర్మాణాలు, పౌరుల సమాధులతో నిండిపోయిన ప్రాంతంగా దర్శనమిస్తుంది. పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు ఒకేఒక్క రహదారి ఉందని.. దానికి ఉక్రెయిన్ సైనికులు ‘జీవ రహదారి’ (Road of Life) అని పేరుపెట్టుకున్నారు.
రష్యా సేనలు, వారి ప్రైవేటు సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సేనలు అక్కడ 220 రోజులుగా వీరోచిత పోరాటం చేస్తున్నాయి. ఈ భీకర దాడుల్లో 20వేలనుంచి 30వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు అంచనా. ఇటు ఉక్రెయిన్ సైన్యం కూడా భారీగా ప్రాణనష్టం చవిచూసింది. ఇలా రష్యా సైన్యం చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సైనికులు.. ఈ యుద్ధక్షేత్రాన్ని భూమ్మిదే అత్యంత నరకమైన ప్రదేశంగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో సుదీర్ఘకాలం పాటు పోరు కొనసాగడంతోపాటు సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయిన ఫ్రాన్స్లోని ‘వెర్డన్’తో పోల్చిచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒక కొలిక్కి రావడం లేదు. దాంతో నెతన్యాహు హెచ్చరించినట్లు రఫా(Rafah)పై దండయాత్ర జరిగితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. -
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్