Rishi Sunak: నెగెటివ్లోకి సునాక్ ఆమోద రేటింగ్.. పీఎం పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) ఆమోద రేటింగ్ నెగెటివ్లోకి పడిపోయింది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత రేటింగ్ ఇలా తగ్గడం ఇదే మొదటిసారి.
లండన్: గత ఏడాది చివర్లో బ్రిటన్ ప్రధానిగా నియమితులైన రిషి సునాక్(UK PM Rishi Sunak)కు ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పదవి చేపట్టిన తర్వాత నుంచి మొదటిసారి ఆయన నెగెటివ్ అప్రూవల్ రేటింగ్ను పొందడం గమనార్హం. తాజాగా కన్జర్వేటివ్ హోంపోల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ నెలవారీ సర్వే ప్రకారం..
గత నెల సునాక్(Rishi Sunak) రేటింగ్ 11.7 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు -2.7కు పడిపోయింది. ప్రధాని పదవి స్వీకరించిన సమయంలో ఆయన ఆమోద రేటు 49.9 శాతంగా ఉంది. ఆ తర్వాత మొదటిసారి ఇప్పుడే నెగెటివ్లోకి వెళ్లిపోయారు. శరణార్థులను రువాండాకు పంపే ప్రణాళికకు కోర్టులో ఎదురుదెబ్బ తగలడం, అలాగే వడ్డీ రేట్లను ఐదు శాతం పెంచాలన్న ఇంగ్లండ్ బ్యాంక్ నిర్ణయం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే సునాక్కు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. రేటింగ్ పరంగా మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్, థెరిసా మే కంటే మెరుగ్గా ఉన్నారు. ఒక దశలో జాన్సన్ రేటింగ్ -33.8కి తగ్గగా, థెరిసా మే రేటింగ్ -51.2కి పడిపోయింది.
సునాక్తో పాటు మరో ఎనిమిది మంది కేబినెట్ సహచరులకు నెగెటివ్ రేటింగే వచ్చింది. అయితే రక్షణ శాఖ మంత్రి బెన్ వాల్లెస్కు అత్యధిక ఆమోద రేటింగ్ లభించింది. అది 77.1 శాతంగా ఉంది. విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ(54.4), హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్(30.4) రేటింగ్ సునాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నారు. బ్రిటన్కు అక్రమంగా వలస వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రువాండాకు తరలించడం తన కల అని, వీసా కాలపరిమితి మించి బ్రిటన్లో ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులని పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సుయెల్లా రేటింగ్ పరంగా సునాక్ కంటే ఎంతో ముందు ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ