Russia: అలెగ్జాండర్ నుంచి నావల్నీ దాకా.. అంతుచిక్కని పుతిన్ విమర్శకుల మరణాలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ను విమర్శించినవారు హఠాత్తుగా మృతి చెందుతుండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా (Russia) ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexey Navalny) మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన మృతికి పుతిన్ (Vladimir Putin) కారణమని ఆయన భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడాలు ఆరోపించాయి. మరోవైపు రష్యాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం మిస్టరీగా మారింది. పుతిన్ హయాంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వారి వివరాలను చూద్దాం.
అలెగ్జాండర్ లిట్వినెంకో (Alexander Litvinenko)
అలెగ్జాండర్ రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్గా పనిచేసేవారు. 1999 మాస్కో అపార్ట్మెంట్ బాంబు దాడులకు పుతిన్ కారణమని ఆరోపిస్తూ, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేవారు. 2006లో లండన్లో ఇద్దరు రష్యన్ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత ఆయన మరణించారు. అలెగ్జాండర్ తాగిన టీలో విషం కలిపారనే వాదనలు అప్పట్లో వినిపించాయి.
ప్రిగోజిన్ (Yevgeny Prigozhin)
కిరాయి సైన్యంగా పేర్కొందిన వాగ్నర్ గ్రూప్నకు ప్రిగోజిన్ నాయకత్వం వహించాడు. ఉక్రెయిన్పై యుద్ధంలో ఈ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. గతేడాది చివర్లో రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే, దీనిపై వెనక్కి తగ్గిన ఆయన, బెలారస్లో ఆశ్రయం పొందారు. పుతిన్, ప్రిగోజిన్ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అప్పట్లో వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
బోరిస్ నెమత్సోవ్ (Boris Nemtsov)
రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్పై 2015లో క్రెమ్లిన్ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. ఈ ఘటనలో చెచెన్కు చెందిన ఐదుగురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే, దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం కనిపెట్టలేకపోయాయి. 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్ పాల్గొన్నాడు. అంతేకాకుండా పుతిన్ నిర్ణయాలపై తరచుగా విమర్శలు చేసేవాడు.
అన్నా పొలిట్కోవ్స్కాయ (Anna Politkovskaya)
రష్యన్ జర్నలిస్ట్ అన్నాను 2006లో ఆమె అపార్ట్మెంట్లో కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్లపై తరచూ విమర్శలు చేసేవారు. అప్పట్లో అన్నా మృతి తర్వాత రష్యాలో ప్రతికా స్వేచ్ఛపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
వీళ్లే కాకుండా మరికొందరు నాయకులు, వ్యాపారవేత్తలు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడగా.. మరికొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా వ్యాపారవేత్త, ఎంపీ ఆంటోవ్ 2022 డిసెంబరులో ఒడిశాలోని రాయగడ హోటల్లో మరణించారు. అంతకు కొద్దిరోజుల ముందు నౌకా రంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్ బుజెకోవ్ ఒక సబ్మెరైన్ ఫ్లోటింగ్ ఫంక్షన్లో హఠాత్తుగా మృతి చెందారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లుక్ ఆయిల్ ఛైర్మన్ రావిల్ మాగ్నోవ్.. గది కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్ప్రామ్ యూనిఫైడ్ సెటిల్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ ట్యూల్కోవ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ విమర్శకుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్పై విమర్శలు చేసిన వారు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
బోయింగ్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్ ఒకరు ఆకస్మికంగా మరణించారు. రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు విజిల్ బ్లోయర్లు మరణించడం గమనార్హం. -
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
USA: ఓ ఆరేళ్ల బాలుడిని అతడి తండ్రి ట్రెడ్మిల్పై వేగంగా పరిగెత్తించడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అగ్రరాజ్యంలో జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
Dubai Rains: దుబాయ్ నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. ఈ ఎడారి దేశానికి వెళ్లే ప్రయాణికులకు భారత ఎయిర్లైన్స్ అడ్వైజరీ జారీ చేశాయి. -
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం