Georgia Airline: అధ్యక్షురాలిపైనే నిషేధం విధించిన ఎయిర్వేస్
జార్జియా అధ్యక్షురాలు (Salome Zourabichvili) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా జార్జియన్ ఎయిర్వేస్ నిషేధం విధించింది.
టిబిలిసి: జార్జియాకు చెందిన విమానయాన సంస్థ జార్జియన్ ఎయిర్వేస్ (Georgian Airways) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా ఆ దేశ అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్విలి (Salome Zourabichvili)పైనే నిషేధం విధించింది. రష్యాకు విమాన సర్వీసులు పునరుద్ధరించడంపై అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సదరు విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జార్జియాతో విమాన సర్వీసులపై నాలుగేళ్లపాటు నిషేధం విధించిన రష్యా (Russia) ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా రష్యాకు వచ్చే జార్జియన్ల వీసా పరిమితులపై సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జార్జియా అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్విలి.. రష్యా చొరవను అడ్డుకోవాలని తమ పౌరులకు సూచించారు. మాస్కోపై విధిస్తున్న ఆంక్షలను పాటించాలని అమెరికా, ఈయూ చేస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా రష్యా ప్రతిపాదనకు లొంగవద్దని ఆమె పిలుపునిచ్చారు. వీటిని లెక్కచేయని జార్జియన్ ఎయిర్వేస్ విమానం.. మాస్కోకు బయలుదేరింది. దీనిపై స్పందిస్తూ ఆ విమానంలో ప్రయాణించనని అధ్యక్షురాలు పేర్కొన్నారు. ఇలా అధ్యక్షురాలు హెచ్చరికలపై జార్జియన్ ఎయిర్వేస్ వ్యవస్థాపకురాలు తమాజ్ డయాస్విలి స్పందించారు. జార్జియన్ ప్రజలకు క్షమాపణలు చెప్పేంతవరకు అధ్యక్షురాలిని తమ విమానాల్లో అనుమతించబోమని, నిషేధం విధిస్తున్నామని వెల్లడించారు.
మరోవైపు రష్యాతో తమ సంబంధాలను మెరుగుపరచుకునేందుకు జార్జియా కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మాస్కోపై ఆంక్షలు విధించేందుకూ నిరాకరించింది. దీంతో జార్జియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ.. విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దీన్ని జార్జియా ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతించగా.. కొందరు జార్జియన్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్విలి సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. రష్యాతో సంబంధాలు పెంచుకోవడం ఈయూలో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న తమకు ఏదో ఒకరోజు ప్రమాదకరంగా మారుతాయని శాలోమ్ జౌరాబిష్విలి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.