Donald Trump: ట్రంప్ పోటీలో లేకపోతే..: కొలరాడో కోర్టు తీర్పుపై వివేక్ రామస్వామి
Donald Trump: ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్నకు అనుమతినివ్వకపోతే.. తాను కూడా వైదొలుగుతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి అన్నారు. ఈ మేరకు కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పుబట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: రిపబ్లికన్ పార్టీ (Republican Party) రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తనపై అనర్హత వేటు వేస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కుట్రేనని మండిపడ్డారు. మరోవైపు ఈ తీర్పుపై రిపబ్లికన్ నేత, అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ పోటీలో లేకపోతే.. తాను కూడా వైదొలుగుతానని ప్రకటించారు.
2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడిని ట్రంప్ ప్రేరేపించిన కారణంగా.. కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భారత సంతతి నేత వివేక్ రామస్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ట్రంప్ను పోటీ పడేందుకు అనుమతించకపోతే నేను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతా. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారు. ఇలాంటి తీర్పుల కారణంగా దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్నకు భారీ షాక్!.. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
బైడెన్.. ప్రజాస్వామ్యానికి ముప్పు: ట్రంప్
‘‘ఎన్నికల పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్, ఆయన సమూహం చేస్తున్న ఇలాంటి విపరీత చర్యలు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని తీవ్ర స్థాయిలో ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు. మేం ఘోరంగా ఓడిస్తామని వారికి తెలుసు. అందుకే.. చట్టసంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని ట్రంప్ మండిపడ్డారు.
వచ్చే ఏడాది మార్చిలో కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టాలని కలలు కంటున్న ట్రంప్నకు ఈ తీర్పు గట్టి షాకిచ్చింది. అయితే, దీనిపై తాము అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ అటార్నీ వెల్లడించింది. తీర్పును సవాల్ చేసేందుకు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ట్రంప్నకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.