China: పవర్ బ్యాంక్లు, యూఎస్బీ పోర్టులు.. చైనా గూఢచర్యం ఇలా కూడా..!
చైనాకు చెందిన ఐ-సూన్ సంస్థ గూఢచర్యం కోసం వాడుతున్న పరికరాల సమాచారం వెలుగులోకి వచ్చింది. రోజువారీ కార్యాలయాల్లో వాడే వస్తువులతోనే ఇది హ్యాకింగ్ చేస్తున్నట్లు తేలింది.
ఇంటర్నెట్డెస్క్: ప్రత్యర్థి దేశాలపై గూఢచర్యం కోసం చైనా (China) కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇటీవల ఆ దేశానికి చెందిన వ్యూహాలను వెల్లడించే పత్రాలు లీకయ్యాయి. డ్రాగన్ తన గూఢచర్యానికి రోజువారీ వినియోగించే పరికరాల్లో మార్పులు చేసి ప్రయోగిస్తున్నట్లు తేలింది. చైనాకు చెందిన ఐ-సూన్ సంస్థ ఈ వ్యవహారాలను చూస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం ఐ-సూన్ సంస్థకు చెందిన దాదాపు 517 పత్రాలను గిట్హబ్ అనే సంస్థ చేజిక్కించుకొని ఆన్లైన్లో పోస్టు చేసింది. హ్యాకింగ్ ప్రపంచంలో ఉండే అరుదైన పరిస్థితులను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
ఈ సంస్థ మార్పులు చేసిన పాపులర్ పవర్ బ్యాంక్లు, యూఎస్బీ పోర్టులు, ఇంటర్నెట్ రౌటర్లు అటాక్ సిస్టమ్స్గా వినియోగిస్తోంది. వీటిని తమ వినియోగదారులకు అందజేస్తోంది. ఒక్కసారి వీటిని ఇన్స్టాల్ చేసి లోకల్ నెట్వర్క్కు కనెక్ట్ చేస్తే ఇవి సమాచార సేకరణను ప్రారంభిస్తాయి. సున్నితమైన డేటా, మేధోసంపత్తి చౌర్యం మొదలుపెడతాయి. ఐ-సూన్ సంస్థ నెట్వర్క్ను భారత్పై సైబర్ గూఢచర్యం కోసం చైనా నియమించుకొంది.
మన ప్రభుత్వ కార్యాలయాలను హ్యాక్ చేసిందా..?
భారత్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను, మంత్రిత్వ శాఖలను, వ్యాపార సంస్థలను ఇది లక్ష్యంగా చేసుకొన్నట్లు లీకైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ ఆఫీసుల్లో వినియోగించే పవర్ బ్యాంక్లు, యూఎస్బీ పోర్టులు, ఇంటర్నెట్ రౌటర్లలో మార్పులు చేసి వైఫై ప్రాక్సిమిటీ అటాక్ సిస్టమ్ వంటి కోవర్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించినట్లు తేలింది. ఫలితంగా వైఫైకు కనెక్ట్ అయ్యే ఆండ్రాయిడ్ ఫోన్లపై ట్రోజన్ హార్స్లు, మాల్వేర్లు దాడి చేసేందుకు వీలు లభిస్తుంది. ఒక్కసారి ఈ పరికరాల ద్వారా చొరబడిన మాల్వేర్ వ్యక్తిగత డేటా, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలను దోచేస్తుంది.
భారత్-బ్రిటన్ సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్పై హూతీల దాడి..!
అంతేకాదు.. ఎటువంటి అనుమానం రాకుండా డేటాను చోరీ చేయడం ఎలా అనే అంశాలను కూడా ఈ పత్రాల్లో వెల్లడించింది. ఇందుకోసం ఎక్స్ ఖాతాలను వాడటం, ఈమెయిల్స్, కస్టమ్ ర్యాట్స్ వినియోగం వంటివి చేస్తున్నాయి. ఔట్లుక్ ఈమెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడానికి, ఐఫోన్ నుంచి డేటా, లొకేషన్లను సంపాదించడానికి అవసరమైన టెక్నిక్స్ ఐ-సూన్ వద్ద ఉన్నాయి. భారత్, యూకే, తైవాన్, మలేషియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను ఈ సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇటీవల తేలింది. ఈ పత్రాలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ‘‘ఐసూన్ హ్యాకర్లు విదేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను తస్కరించినట్లు ఆ పత్రాల్లో ఉంది. భారత్ నుంచి 95.2 గిగాబైట్ల ఇమిగ్రేషన్ డేటాను సేకరించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల కాల్ లాగ్స్ సమాచారాన్ని దొంగిలించారు’’ అని ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!