Iguana Island: అమ్మకానికి ఐలండ్.. ధరెంతో తెలుసా?
ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొనే ధరకే ఓ ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చని తెలుసా..? ఎక్కడనేగా మీ సందేహం? భారత్లో మాత్రం కాదు.
ఇంటర్నెట్ డెస్క్: సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న భూముల ధరలతో చాలా మంది మధ్య తరగతి వారికి సొంతిల్లు ఒక కలగానే మిగిలిపోతుంది. మరోవైపు సంపన్న వర్గాలు తమ అభిరుచికి తగినట్లుగా విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి కూడా ముంబయి వంటి మహానగరంలో కోట్లు కుమ్మరించినా.. అపార్ట్మెంట్ మించి కొనలేని పరిస్థితి. అక్కడ ధరలు ఓ రేంజ్లో ఉంటాయి మరి. అయితే, ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొనే ధరకే ఓ ద్వీపాన్ని (Island) సొంతం చేసుకోవచ్చని తెలుసా? ఎక్కడనేగా మీ సందేహం? భారత్లో మాత్రం కాదు.
ఈ ద్వీపం మధ్య అమెరికాలోని నికరాగువా (Nicaragua) దేశంలో బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి 19.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని పేరు ఇగువానా ఐలండ్ (Iguana Island). సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో కొబ్బరి, అరటి చెట్ల మధ్య మూడు గదుల విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో హాల్, కిచెన్, బార్, లివింగ్ ఏరియాతోపాటు పనివారి కోసం ప్రత్యేకంగా కొన్ని గదులు కూడా ఉన్నాయి. ఇంటి బయట స్విమ్మింగ్ పూల్, ఫిష్ డాక్ను నిర్మించారు. ద్వీపానికి చుట్టూ ఉన్న ప్రకృతి ఆందాలను చూసేందుకు 28 అడుగుల వాచ్ టవర్ కూడా ఉంది. వైఫై, టీవీ, ఫోన్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఈ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారు ప్రైవేట్ ఐలండ్ ఆన్లైన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి నికరాగువా ప్రాంతంపై క్లిక్ చేస్తే ఇగువానా ఐలండ్ వివరాలు కనిపిస్తాయి. వెబ్సైట్ ప్రకారం ఈ ద్వీపం ధర 475 వేల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు ₹3.87 కోట్లు. ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆన్లైన్ వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ III కంటే ఎక్కువని వెల్లడైంది. -
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM