King Charles III: కింగ్ ఛార్లెస్-3కి అనూహ్య అనుభవం
యూనివర్సిటీ క్యాంపస్ వార్షికోత్సవానికి వెళ్లిన కింగ్ ఛార్లెస్-3కి అనూహ్య అనుభవం ఎదురైంది. ప్రిన్స్ హ్యారీని తిరిగి బ్రిటన్కు రప్పించాలంటూ ఓ విద్యార్థి ఆయన్ను అడిగాడు.
ఇంటర్నెట్డెస్క్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3కు (King Charles III) అనూహ్య అనుభవం ఎదురైంది. చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ (Prince Harry), ఆయన భార్య మేఘన్ మార్కెల్ తిరిగి ప్యాలెస్కు వస్తారా?అని కొందరు విద్యార్థులు ఆయన్ని ప్రశ్నించారు. దీంతో ఒకింత అసౌకర్యానికి గురైన ఛార్లెస్-3 ‘అదే జరిగితే మంచిదే’ అంటూ బదులిచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ స్ట్రాన్ఫోర్డ్ క్యాంపస్ 125వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తుండగా.. ఓ విద్యార్థి ‘దయచేసి హ్యారీని వెనక్కి తీసుకురాగలరా’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ మాటలు తొలుత ఛార్లెస్కు సరిగ్గా వినిపించలేదు. ‘ఎవరు?’ అంటూ మళ్లీ అడిగారు. ‘హ్యారీ.. మీ కుమారుడు’ అంటూ అవతలి విద్యార్థి బదులిచ్చాడు. ఈ ప్రశ్నతో ఒకింత ఇబ్బందికి గురైన కింగ్.. అలా జరిగితే మంచిదే అంటూ ముందుకు సాగిపోయారు.
2020లో ప్రిన్స్ హ్యారీ, మార్కెల్ రాచరిక హోదాను వదులుకున్న సంగతి తెలిసిందే. కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలతో వారు రాజభవనానికి దూరంగా తమ ఇద్దరి పిల్లలతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. 2022లో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు కూడా హ్యారీ.. వివాదంలో చిక్కుకున్నారు. రాజుకు గౌరవ సూచకంగా బ్రిటిషర్లు ఆలపించే ‘గాడ్ సేవ్ ది కింగ్’ జాతీయ గీతాన్ని హ్యారీ పాడలేదని కొందరు, మధ్యలోనే ఆపేశారని మరికొందరు ఆరోపించారు. ఆ తర్వాత వెస్ట్మినిస్టర్ అబేలో అట్టహాసంగా నిర్వహించిన కింగ్ ఛార్లెస్ పట్టాభిషేక కార్యక్రమంలోనూ హ్యారీ పాల్గొన్నారు. ఈ వేడుకలో తన కజిన్స్తో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కనిపించారు. అయితే ఈ కార్యక్రమానికి హ్యారీ ఒంటరిగానే వచ్చారు. అప్పుడు భార్య మేఘన్ మార్కెల్, ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉండిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
Dubai Rains: దుబాయ్ నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. ఈ ఎడారి దేశానికి వెళ్లే ప్రయాణికులకు భారత ఎయిర్లైన్స్ అడ్వైజరీ జారీ చేశాయి. -
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు