NATO: నాటోలో చేరిన ఫిన్లాండ్.. యుద్ధం వేళ పుతిన్కు ఎదురుదెబ్బ!
ఫిన్లాండ్కు అధికారికంగా ‘నాటో’ సభ్యత్వం దక్కింది. ఫలితంగా.. నాటో దేశాలతో రష్యా సరిహద్దు దాదాపు రెట్టింపు అయ్యింది. ఫిన్లాండ్లో ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తున్నామని, దాని ఆధారంగానే అవసరమైన చర్యలు తీసుకుంటామని క్రెమ్లిన్ స్పందించింది.
బ్రసెల్స్: నాటో (NATO) కూటమిలో 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ (Finland) అవతరించింది. అమెరికా (America), ఫిన్లాండ్ విదేశాంగ మంత్రులు ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీంతో నాటోలో ఫిన్లాండ్ అధికారికంగా చేరినట్లయ్యింది. నాటో విస్తరణను మొదటినుంచి వ్యతిరేకిస్తోన్న రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin)కు.. తాజా పరిణామంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రష్యాతో ఫిన్లాండ్ 1340 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉంది. తాజా చేరికతో.. నాటో దేశాలతో రష్యా సరిహద్దు దాదాపు రెట్టింపు అయ్యింది.
మరోవైపు.. నాటో విస్తరణను రష్యా భద్రత, జాతీయ ప్రయోజనాల ఉల్లంఘనగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ అభివర్ణించారు. ఫిన్లాండ్లో ఏం జరుగుతోందో నిశితంగా గమనిస్తున్నామని, దాని ఆధారంగానే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్, స్వీడన్లు సైనికపరంగా తటస్థ వైఖరిని అవలంబించినా.. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలు నాటో దిశగా అడుగులు వేశాయి. గత ఏడాది మేలో ఈమేరకు దరఖాస్తు చేసుకోగా.. ఏడాది లోపే ఫిన్లాండ్ చేరిక ప్రక్రియ పూర్తయింది. స్వీడన్ విషయంలో తుర్కియే, హంగరీలు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఫిన్లాండ్ చేరికపైనా గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తుర్కియే.. ఇటీవల సానుకూలత వ్యక్తం చేయడంతో ఆ దేశానికి మార్గం సుగమమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.