Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్కు నోబెల్
అమెరికా ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్కు అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది.
స్టాక్హోం: అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize) అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ (Claudia Goldin)కు లభించింది. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సమగ్రమైన అధ్యయనానికిగానూ గోల్డిన్ (77)ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) వెల్లడించింది. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న మహిళల్లో గోల్డెన్ మూడో వ్యక్తి కావడం విశేషం.
‘గత శతాబ్దంలో అనేక అధిక ఆదాయ దేశాల్లో వేతన మహిళల నిష్పత్తి మూడు రెట్లు పెరిగింది. ఆధునిక కాలంలో కార్మిక రంగంలో ఇది అతిపెద్ద సామాజిక, ఆర్థిక మార్పుల్లో ఒకటి. అయితే, స్త్రీ- పురుష అంతరాలు అలాగే ఉన్నాయి! మహిళల సంపాదనతోపాటు ఈ వ్యత్యాసాల మూలాలను వివరించేందుకు క్లాడియా గోల్డిన్ సమగ్ర అధ్యయనం చేశారు. క్లాడియా గోల్డిన్ పరిశోధనలు.. లేబర్ మార్కెట్లో మహిళల చారిత్రక, సమకాలీన పాత్రలపై ఎప్పటికప్పుడు సరికొత్త, ఆశ్చర్యకరమైన వివరాలను అందించాయి’ అని నోబెల్ కమిటీ తెలిపింది.
ఇజ్రాయెల్ ఎదుట పెనుసవాల్.. గాజా సొరంగాల్లోకి బందీలు..!
‘శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం సమాజానికి ఎంతో ముఖ్యం. ఈ రంగంలో క్లాడియా గోల్డిన్ సాగించిన పరిశోధనలకు ధన్యవాదాలు. వాటి ద్వారా అంతర్లీన కారకాలు, భవిష్యత్తులో ఏ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలో మనకు మరింత తెలిసింది’ అని అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కమిటీ ఛైర్మన్ జాకోబ్ స్వెన్సన్ పేర్కొన్నారు. క్లాడియా గోల్డిన్ 1946లో న్యూయార్క్లో జన్మించారు. షికాగో యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. గతేడాది అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్లకు నోబెల్ అందించారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై సాగించిన కీలక పరిశోధనలకుగానూ ఈ అవార్డు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ