Kim: క్షిపణి ప్రయోగానికి కిమ్ కుమార్తె.. తొలిసారి బయటి ప్రపంచంలోకి..!
జపాన్ ప్రాదేశిక జలాల సమీపంలోకి ఉ.కొరియా శుక్రవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగం వేళ.. కిమ్ కుమార్తె మొదటిసారి బయట ప్రపంచానికి కనిపించింది.
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా దేశం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుటుంబ విషయాలు కూడా రహస్యమే. ఈ క్రమంలో కిమ్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు. ఖండాంతర క్షిపణి ప్రయోగానికి ముందు దానిని పరిశీలించేందుకు ఆయన తన కూతురును వెంటబెట్టుకొచ్చారు.
థాయిలాండ్లో ఆసియా పసిఫిక్ తీర దేశాల ఆర్థిక సహకార మండలి (ఎపెక్) శిఖరాగ్ర సభ జరుగుతున్నవేళ ఉత్తర కొరియా దుందుడుకు చర్యకు పాల్పడింది. జపాన్ ప్రాదేశిక జలాల సమీపంలోకి శుక్రవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అణ్వస్త్రాన్ని మోస్తూ అమెరికా భూభాగాన్ని సైతం తాకగల సామర్థ్యం ఉన్న క్షిపణి అది. ఇంతవరకు పిల్లల గురించి ఏ వివరమూ చెప్పని కిమ్.. ఇలా ప్రయోగ ప్రదేశానికి కుమార్తెను తీసుకురావడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే అక్కడి మీడియా ఆ చిన్నారి పేరును మాత్రం వెల్లడించలేదు.
‘ఒక బహిరంగ కార్యక్రమంలో కిమ్ కుమార్తెను చూసిన మొదటి సందర్భం ఇదే’ అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కిమ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడని గతంలో కొన్ని కథనాలు వెల్లడించాయి. 2013లో అమెరికన్ మాజీ బాస్కెట్ బాల్ స్టార్ డెన్నిస్ రోడ్మ్యాన్ గతంలో ఉత్తర కొరియాలో పర్యటించారు. తన పర్యటన గురించి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను కిమ్ కుటుంబంతో గడిపానని చెప్పారు. వారి కుమార్తె పేరు జు యె(Ju Ae) అని కూడా వెల్లడించారు. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ బాలిక మరో నాలుగైదేళ్లలో సైన్యంలో బాధ్యతలు నిర్వహించే వయసుకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వారసత్వ బాధ్యతల నిమిత్తం ఆమెను సిద్ధం చేస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాన్ని విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కిమ్ తర్వాత ఆ దేశాన్ని పాలించేదెవరు అనే దానిపై ఆ కుటుంబం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా లేదు. ఒకవేళ కిమ్ పాలించలేని దశలో ఉంటే.. వారసుడు వచ్చే వరకు ఆయన సోదరి బాధ్యతలు చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామం నాలుగో తరానికి అక్కడి సమాజం సిద్ధంగా ఉండాలన్న సూచన ఇస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కిమ్ సతీమణి కూడా చాలా అరుదుగానే బయట కనిపిస్తుంటారు. ‘ఆమె బాహ్య ప్రపంచంలోకి రావడంలో కూడా వ్యూహాత్మక సందేశం ఇమిడి ఉంటుంది. ఉద్రిక్తతలు తగ్గించడం, అంతర్గత సమస్యల సమయంలో కుటుంబం ఐక్యంగా ఉందని తెలియజేసే విధంగా ఆ సందేశం ఉంటుంది’ అని యూఎస్కు చెందిన లాభాపేక్ష లేని ఒక సంస్థ అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి