Age Standardize: దక్షిణ కొరియన్ల వయసు తగ్గనుంది!
దక్షిణ కొరియా(South Korea) పౌరుల వయసు.. ఒకటి, రెండేళ్లు తగ్గనుందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! అవును. ఈ దేశంలో వయసు లెక్కింపును ప్రమాణీకరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడమే దీనికి కారణం.
సియోల్: దక్షిణ కొరియా(South Korea) పౌరుల వయసు.. ఒకటి, రెండేళ్లు తగ్గనుందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! అవును. ఈ దేశంలో వయసు లెక్కింపును ప్రమాణీకరించేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడమే దీనికి కారణం. ప్రస్తుతం దక్షిణ కొరియన్లకు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వయసు లెక్కింపు విధానాలు ఉన్నాయి. అంతర్జాతీయ వయసు, కొరియన్ వయసు, క్యాలెండర్ వయసు.. ఇలా ఒక్కో వ్యక్తికి మూడు వయసులు ఉండటం ఇక్కడ సర్వసాధారణం. ఈ గందరగోళానికి తెరదించేందుకు పార్లమెంట్ ఇటీవల ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే.. 2023 జూన్ నుంచి అంతర్జాతీయ వయసునే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది.
ఏ వయసు ఎలా లెక్కిస్తారంటే..
* అంతర్జాతీయం: దీని ప్రకారం పుట్టినప్పుడు శిశువు వయసు ‘సున్నా’నుంచి మొదలవుతుంది. ఆపై.. వచ్చే ఏడాది అదే తేదీనాటికి ఒకటి చొప్పున లెక్కిస్తారు. ప్రపంచంలోని చాలావరకు దేశాలు ఇదే వ్యవస్థను పాటిస్తాయి.
* కొరియన్: స్థానికులను వారి వయసు అడిగినప్పుడు.. చాలా మంది అంతర్జాతీయ వయసు కంటే ఒకటి, రెండు ఎక్కువగానే చెబుతారు. కారణం.. అక్కడ శిశువు పుట్టగానే ఒక ఏడాది వయసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రతి జనవరి 1న ఒక్కో ఏడాది జోడిస్తారు.
* క్యాలెండర్: కొన్ని సందర్భాల్లో దక్షిణ కొరియన్లు క్యాలెండర్ వయసునూ ఉపయోగిస్తారు. ఇది అంతర్జాతీయానికి, కొరియన్కు మధ్యలో ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు వయసు సున్నాగానే ఉంటుంది. అనంతరం.. ప్రతి జనవరి 1న మరో సంవత్సరం కలుపుతారు.
* ఉదాహరణ: దక్షిణ కొరియాకు చెందిన ఒక యువకుడు 1994 డిసెంబరు 31న జన్మించాడని అనుకుందాం. ఇంటర్నేషనల్ ప్రకారం అతని వయసు ప్రస్తుతం.. 27. అదే.. కొరియన్ ప్రకారం.. 29, క్యాలెండర్ ప్రకారం.. 28గా ఉంటుంది.
ఈ లెక్కింపు ప్రక్రియ గందరగోళంగా అనిపిస్తోందా! దక్షిణ కొరియాలో మాత్రం ఇది సాధారణమే. పౌరులు తమ రోజువారీ జీవితంలో, సామాజిక అంశాల్లో కొరియన్ వయసును ఉపయోగిస్తారు. చట్టపరమైన, అధికారిక విషయాల్లో అంతర్జాతీయ వయసు నమోదు చేస్తారు. మద్యపానం, ధూమపానం, నిర్బంధ సైనిక శిక్షణ వంటి విషయాల్లో క్యాలెండర్ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, తాజా నిర్ణయం.. అన్ని న్యాయ, పరిపాలనా వ్యవహారాల్లో అంతర్జాతీయ వయసును ప్రామాణికం చేస్తుంది. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలూ.. పౌరులను ఇదే విధానం పాటించేలా ప్రోత్సహించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..! -
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒక కొలిక్కి రావడం లేదు. దాంతో నెతన్యాహు హెచ్చరించినట్లు రఫా(Rafah)పై దండయాత్ర జరిగితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. -
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు