David Cameron: హౌతీలపై దాడులు ఫలితాన్నిస్తున్నాయి: బ్రిటన్
హౌతీల చర్యలను ఏమాత్రం సహించమని బ్రిటన్ హెచ్చరించింది. సోమవారం రాత్రి అమెరికా-బ్రిటన్ సంయుక్తంగా యెమెన్లోని తిరుగుబాటుదారుల స్థావరాలపై దాడులు చేశాయి.
ఇంటర్నెట్డెస్క్: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికాతో కలిసి తాము చేస్తున్న దాడులను బ్రిటన్ సమర్థించుకొంది. యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ (David Cameron) మాట్లాడుతూ..‘‘ ఎర్ర సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి హౌతీలు ముప్పుగా మారారు. వారి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం సంకీర్ణాన్ని సిద్ధం చేశాం. హౌతీలను దెబ్బతీయడానికి సోమవారం జరిపిన దాడుల్లో మా దేశానికి చెందిన నాలుగు టైఫూన్ జెట్లు పాల్గొన్నాయి. గత 10 రోజుల్లో రెబల్స్ 12 నౌకలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాతో కలిసి వారికి స్పష్టమైన సంకేతాలు పంపేలా చర్యలు తీసుకొన్నాం. మా దాడులు ఫలిస్తున్నాయని నమ్ముతున్నాను. హౌతీల వాదనను మేం ఏమాత్రం అంగీకరించం. చివరికి యెమెన్ ప్రభుత్వం కూడా వారితో ఏకీభవించడం లేదు’’ అని వివరించారు.
భారత్తో వివాదం వేళ.. మాల్దీవుల దిశగా చైనా పరిశోధక నౌక
అమెరికా, బ్రిటన్ దళాలు సోమవారం అర్ధరాత్రి హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై మరోసారి వైమానిక దాడులు నిర్వహించాయి. మొత్తం ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఇవి జరిగాయి. క్షిపణులు, ఆయుధాగారాలు, డ్రోన్ వ్యవస్థలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా సీనియర్ సైనికాధికారులు ప్రకటించారు. అమెరికా విమాన వాహక నౌక ఐసన్హోవర్పై నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలతోపాటు, మరో యుద్ధనౌక, ఒక జలాంతర్గామి ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. దాదాపు 30 వరకు గురితప్పని ఆయుధాలను లక్ష్యాల పైకి ప్రయోగించామని చెప్పారు. తొలిసారి హౌతీల భూగర్భ ఆయుధ గోదాములను కూడా లక్ష్యంగా చేసుకొన్నట్లు వివరించారు. వీటిల్లో తిరుగుబాటుదారులు వాడే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వెల్లడించారు.
సోమవారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో కలిసి ఎర్ర సముద్రంలో పరిస్థితిపై చర్చలు జరిపారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గి సుస్థిరత ఏర్పడాలని వారు ఆకాంక్షించారు. అదే సమయంలో ప్రజలు, వాణిజ్య నౌకలను రక్షించే క్రమంలో దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో చేపట్టిన చర్యలకు అమెరికా ‘ఆపరేషన్ పొసైడాన్ ఆర్చర్’ అని పేరు పెట్టినట్లు సీఎన్ఎన్ కథనంలో పేర్కొంది. దీంతో సుదీర్ఘకాలంపాటు ఇది కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాలపై హౌతీలు స్పందించారు. ‘‘దాడులు యెమెన్ ప్రజలను మరింత బలోపేతం చేస్తాయి. దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వారు మరింత బలంగా పనిచేస్తారు’’ అని ఎక్స్లో హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు