Pannun: పన్నూ హత్యకు కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాకు ఆధారాలివ్వలేం: అమెరికా
Gurpatwant Singh Pannun: నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భారత వ్యక్తి నిఖిల్ గుప్తాకు కేసుకు సంబంధించిన వివరాలివ్వలేమని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు న్యూయార్క్ కోర్టుకు తమ స్పందన తెలియజేసింది.
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందంటూ అమెరికా (USA) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్కు చెందిన నిఖిల్ గుప్తా (Nikhil Gupta) అనే వ్యక్తి ప్రమేయం ఉందన్న అగ్రరాజ్యం.. అతడిపై నేరాభియోగాలను నమోదు చేసింది. దీంతో గుప్తా న్యాయవాది ఇటీవల న్యూయార్క్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలివ్వాలని కోరారు. అయితే, ఇందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించింది.
నిఖిల్ గుప్తాను గతేడాది జూన్లో చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాగ్ జైల్లో ఉన్న అతడిని ఆధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 4న గుప్తా తరఫు న్యాయవాది.. న్యూయార్క్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ కేసులో అతడిపై నేరాభియోగాలు మోపిన అమెరికా.. ఆధారాలు, ఆరోపణలను బలపర్చే పత్రాలను అందజేయలేదు. న్యాయవాదులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. జైల్లో అతడిని అగ్రరాజ్య అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ కేసులో అతడు విచారణ ఎదుర్కోవాలంటే ముందు కేసుకు సంబంధించిన వివరాలను అందజేయాలి’’ అని గుప్తా న్యాయవాది అభ్యర్థించారు.
అమెరికా రక్షణమంత్రికి ప్రొస్టేట్ క్యాన్సర్.. గోప్యతపై సర్వత్రా అనుమానాలు
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్పందన తెలియజేయాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే బుధవారం ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తమ సమాధానం తెలియజేశారు. గుప్తా అభ్యర్థనను తాము వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ కేసులో గుప్తా.. న్యూయార్క్ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామన్నారు. గుప్తా న్యాయవాది ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ప్రాగ్ జైల్లో నిందితుడిని అమెరికా దర్యాప్తు అధికారులు కేవలం రెండు సార్లు మాత్రమే కలిశారు. ఆ సందర్భాల్లోనూ అతడి హక్కులను ఉల్లంఘించలేదు. న్యాయవాదుల సమక్షంలోనే అతడిని ప్రశ్నించారు’’ అని యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ స్పందనలో తెలియజేశారు.
పన్నూ హత్య కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసిందని, ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓ భారత అధికారితో కలిసి నిఖిల్ గుప్తా ఈ కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై అమెరికా ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణలపై దర్యాప్తునకు భారత్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్