YSRCP: అవనిగడ్డ వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మద్య కొట్లాట

అవనిగడ్డ వైకాపా(YSRCP)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో.. నాబార్డు ఛైర్మన్‌ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. కొట్లాటకు దారితీసింది. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే వర్గీయిలు దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే రమేష్‌బాబు స్పందిస్తూ.. ఎంపీ బాలశౌరికి, తనకు మధ్య ఎలాంటి వర్గ విభేదాలూ లేవన్నారు.

Published : 28 Jan 2023 17:19 IST

YSRCP: అవనిగడ్డ వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మద్య కొట్లాట

అవనిగడ్డ వైకాపా(YSRCP)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో.. నాబార్డు ఛైర్మన్‌ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. కొట్లాటకు దారితీసింది. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే వర్గీయిలు దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే రమేష్‌బాబు స్పందిస్తూ.. ఎంపీ బాలశౌరికి, తనకు మధ్య ఎలాంటి వర్గ విభేదాలూ లేవన్నారు.

Tags :

మరిన్ని