Puvvada: తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు.. లేకపోతే దొంగ ఓటా..?: పువ్వాడ

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్ నాయకుడినని చెప్పే తుమ్మల.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటన్నారు. తుమ్మలకు ఓటు వేసేవారికే.. ఓటు ఉండాలా? అని ప్రశ్నించారు. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని పువ్వాడ ఆక్షేపించారు.

Updated : 07 Nov 2023 16:13 IST

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్ నాయకుడినని చెప్పే తుమ్మల.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటన్నారు. తుమ్మలకు ఓటు వేసేవారికే.. ఓటు ఉండాలా? అని ప్రశ్నించారు. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని పువ్వాడ ఆక్షేపించారు.

Tags :

మరిన్ని