బ్రేకింగ్

breaking
03 Oct 2022 | 18:44 IST

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో రూ.3,800 కోట్లు ప్రత్యేక ఖాతాలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని 1996లో పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2014లో పిటిషన్‌ను ఎన్జీటీకి బదిలీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై విచారణకు స్వీకరించిన ఎన్జీటీ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి పురోగతి చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని

తాజా వార్తలు