బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 21:15 IST

జడేజా హాఫ్‌ సెంచరీ.. ధోనీ మెరుపులు.. లఖ్‌నవూ టార్గెట్‌ 177

లఖ్‌నవూ: లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రహానే (36), మొయిన్‌ అలీ (30) పరుగులు చేశారు. రచిన్‌ రవీంద్ర (0), గైక్వాడ్‌ (17), దూబె (3), రిజ్వీ (1) నిరాశ పరిచారు. చివర్లో ధోని (28*, 9 బంతుల్లో 3×4,2×6) మెరుపులు మెరిపించాడు. బౌలర్లలో కృనాల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్‌, యశ్‌ ఠాకూర్‌, బిష్ణోయ్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు