బ్రేకింగ్

breaking
02 May 2024 | 17:22 IST

దిల్లీ సుల్తాన్‌ల ఆటలు సాగవు : రేవంత్‌ రెడ్డి

ఆసిఫాబాద్‌: కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వాటిని రద్దు చేయాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ భాజపాకు వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నానని నాపై కేసులు పెట్టారు. కేసీఆర్‌ 200 కేసులు పెట్టినా భయపడలేదు. అలాంటిది మోదీ బెదిరించగలరా? దిల్లీ సుల్తానులు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారు. వారి ఆటలు సాగవు. పదేళ్లు మోదీ, కేసీఆర్‌ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్‌కు ఏమీ చేయలేదు’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని