
తాజా వార్తలు
మూఢనమ్మకాలతో కళను చంపేస్తున్నారు
ముంబయి: కొంతమంది మూఢనమ్మకాలతో కళను చంపేస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూతపడటంతో ఇటీవల కాలంలో సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదలవున్నాయి. ఇందులో భాగంగానే ఓటీటీ వేదికలను ప్రభుత్వం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ ఉద్యమంపై సిన్హా అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘లాక్డౌన్ కాలం నుంచి సినీ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ వేదికలు సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. అయితే.. కొంతమంది వాళ్ల మూఢనమ్మకాలు, మతతత్వ భావాలతో కళను, సృజనాత్మకతను చంపేస్తున్నారు. ఇది ఎంతో భవిష్యత్తు ఉన్న సినీ పరిశ్రమ. మిడిమిడి జ్ఞానంతో సినిమాలను నాశనం చేయొద్దు. జైహింద్’ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
Tags :