పవర్‌గ్రిడ్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీలు

మహారత్న కేటగిరీకి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 29 Nov 2023 06:48 IST

మహారత్న కేటగిరీకి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ప్రీ-ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

లక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఐటీఐ (ఎలక్ట్రికల్‌) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఉన్నత సాంకేతిక అర్హతలైన డిప్లొమా/ బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. దరఖాస్తు రుసుము రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

మొత్తం 203 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులకు 89, ఈడబ్ల్యూఎస్‌కు 18, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 47, ఎస్సీలకు 39, ఎస్టీలకు 10 కేటాయించారు.

12.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటగిరీని బట్టి పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాల సడలింపు ఉంటుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్టులుంటాయి.

  • పార్ట్‌-1లో టెక్నికల్‌ నాలెడ్జ్‌ (టీకేటీ) 120 ప్రశ్నలు ఉంటాయి.
  • పార్ట్‌-2లో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏటీ) - 50 ప్రశ్నలకు ఉంటుంది.
  • ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ, ఒకటికంటే ఎక్కువ జవాబులు గుర్తించినా.. పావు మార్కు తగ్గిస్తారు.
  • పార్ట్‌-1లోని టెక్నికల్‌ నాలెడ్జ్‌ (టీకేటీ) ప్రశ్నలు ఐటీఐ-ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ సిలబస్‌కు సంబంధించినవి ఉంటాయి. ఈ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. నీ చదివిన సబ్జెక్టులేనని నిర్లక్ష్యం చేయకుండా వాటిలో గట్టి పట్టు సాధించాలి.
  • పార్ట్‌-2లోని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో భాగంగా..జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌-2లోని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ కోసం.. బ్యాంక్‌, ఎస్‌ఎస్‌సీలాంటి పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు.
  • ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకుని వాటికి అదనంగా సమయాన్ని కేటాయించాలి.
  • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మోడల్‌ టెస్ట్‌లనూ రాయడం ద్వారానూ ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు.
  • ముఖ్యంగా నిర్ణీత వ్యవధిలోగా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం సాధన చేయాలి.

అర్హతకు ఎన్ని మార్కులు?

పరీక్షలో అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, రిజర్వుడ్‌ కేటగిరీ వారు 30 శాతం అర్హత మార్కులు సాధించాలి.

  • సీబీటీలో అర్హత సాధించినవాళ్లను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
  • ట్రేడ్‌ టెస్ట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
  • రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనేది వెబ్‌సైట్‌లో వివరంగా తెలియజేశారు.
  • పరీక్ష కేంద్రాలను రీజియన్లవారీగా విభజించారు. ఎస్‌ఆర్‌-1 రీజియన్‌ కిందికి.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు రాత పరీక్షకు దరఖాస్తులో ఎస్‌ఆర్‌-1 రీజియన్‌ను ఎంపిక చేసుకోవాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఒకే రోజున, ఒకే సెషన్‌లో జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఒక్క రీజియన్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి.

గమనించాల్సినవి

ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి.

దరఖాస్తు ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి. దీన్ని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ సమయంలో సమర్పించాలి.

ప్రభుత్వ/ పీఎస్‌యూల్లో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు సమయంలోనే ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను అప్‌లోడ్‌ చేయాలి.

రాత పరీక్షకు హాజరయ్యే ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తారు.

రాత పరీక్షను జనవరి-2024లో నిర్వహించవచ్చు.  

దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023

వెబ్‌సైట్‌: http://www.powergrid.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని