Viral: పెళ్లి విందులో వివాదం.. కుర్చీలతో కొట్టుకున్న అతిథులు..
ఓ వివాహ వేడుకలో సరదాగా చేసిన చేష్ట.. తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అది ఓ వివాహా వేడుక. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఎంతో అప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. మరో వైపు మంచి రుచికరమైన పెళ్లి విందు మొదలైంది. ఇంతలో భోజనాల వద్ద జరిగిన ఓ చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. కుర్చీలతో కొట్టుకునే దాకా వచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పెళ్లికి వచ్చిన అతిథులు టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ టేబుల్ వరుసలో కూర్చున్న మరో వ్యక్తి టోపీ తీశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దిగారు. అక్కడున్న వారు కూడా జోక్యం చేసుకోవడంతో.. ఈ వివాదం పెద్దగా మారింది. దీంతో ఇరువర్గాలు రెచ్చిపోయి రెజ్లింగ్ తరహాలో కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ ఘటన గతవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘నాకు మటన్ వేయకపోతే ఇలానే విసిగిపోతాను’, ‘ఇలాంటి ఫైటింగ్ సినిమాలో ఉంటే ఇంకా బాగుంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా