AP News: డిజిటల్ లైబ్రరీలతో వర్క్ఫ్రమ్ హోమ్ సాధ్యమే: సీఎం జగన్
రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల...
అమరావతి: రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుందన్నారు. అవసరమైన చోట్ల డిజిటల్ లైబ్రరీలను నిర్మించాలని సూచించారు.
వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్షించారు. సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అధికారులు పాల్గొన్నారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఫేజ్-1లో 4,530 గ్రామాల్లో లైబ్రరీల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. తొలిదశలో నిర్మిస్తున్న లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ ఫిబ్రవరి 2022 నాటికి పూర్తవుతుందని సీఎంకు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికల్లా తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్ ఫ్రమ్ హోం సాధ్యమవుతుందన్న సీఎం.. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్ టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు డెస్క్ టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఐరన్ రాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫేజ్-1లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్-2లో కవర్ అయ్యేలా చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్