icon icon icon
icon icon icon

Chandrababu: ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం: చంద్రబాబు

ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 10 May 2024 19:24 IST

మాచర్ల: ముస్లింల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా చంద్రబాబు పాల్గొనాల్సిన మాచర్ల సభ రద్దయింది. దీంతో ఆయన మాచర్ల ప్రజలనుద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. 

‘‘ముస్లింలకు రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణం ఇచ్చాం. దుల్హన్‌ పథకం ఇస్తాం, రంజాన్‌ తోఫా ఇస్తాం. వైకాపా నేతలు పల్నాడు ప్రాంతాన్ని రక్తంతో తడిపేశారు. పిన్నెల్లి.. హత్యా రాజకీయాలు చేస్తున్నారు. కత్తి పట్టుకున్నవారు.. దాంతోనే పోతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రౌడీ రాజకీయాలను అణచివేస్తాం. పద్ధతి మార్చుకోవాలని పిన్నెల్లిని హెచ్చరిస్తున్నా. వైకాపా ఒక్క ఎంపీ గెలిచినా దిల్లీలో ఎవరికి మద్దతిస్తుందో చెప్పాలి. ఆ పార్టీ చేసేది దిల్లీలో ఒకటి.. గల్లీలో మరొకటి. వైకాపా పాలనలో ఐదేళ్లు అప్రజాస్వామిక పరిస్థితులు. మాచర్ల ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. చంద్రయ్య, జంగయ్య లాంటి కార్యకర్తల త్యాగాలు మరిచిపోను. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చాక మాచర్లలో పరిస్థితి మారింది’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img