సెట్ కాలేదు
ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రవేశాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాలు సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు
నాలుగు సెట్లకు విడుదలకాని కౌన్సెలింగ్ షెడ్యూల్
రాష్ట్ర వ్యాప్తంగా 83వేల మంది అభ్యర్థుల ఎదురుచూపులు
ఈనాడు, అమరావతి: ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ప్రవేశాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాలు సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించడం లేదు. ఇప్పటి వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా మొదటి విడత మాత్రమే పూర్తయింది. ఈ కౌన్సెలింగ్లోనూ కళాశాలల అనుబంధ గుర్తింపు జాబితా రాలేదని, సీట్ల కేటాయింపులో సాంకేతిక సమస్యలంటూ కాలయాపన చేశారు. బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇంజినీరింగ్ రెండో విడత ప్రవేశాలు చేపట్టాలి. ప్రస్తుతం ఈసెట్, పీజీఈసెట్ కౌన్సెలింగ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రవేశాల
కౌన్సెలింగ్లో
జాప్యం కారణంగా తరగతులు ప్రారంభం కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉంటున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నందున విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ ప్రవేశాలు జరగకపోవడంతో మొదటి ఏడాది వారు తరగతులకు హాజరు కాలేకపోతున్నారు.
అనుబంధ గుర్తింపు ఎప్పటికి..
ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, న్యాయవిద్య, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీసెట్లలో రాష్ట్ర వ్యాప్తంగా 83,876మంది అర్హత సాధించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి సెప్టెంబరులోనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు అనుమతి ఇచ్చింది. వీటికి విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఆలస్యం చేశాయి. ఇటీవలే వర్సిటీలు అనుమతులు ఇవ్వడంతో జాబితాను ఉన్నత విద్యాశాఖకు పంపారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. న్యాయ విద్య కళాశాలలకు మొదట వర్సిటీలు, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొదటిసారిగా పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 146కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంది. మొదట్లో డిగ్రీ ఫలితాలు పెండింగ్ ఉందంటూ కౌన్సెలింగ్ జాప్యం చేశారు. ఇప్పుడు దాదాపు అన్ని వర్సిటీలు ఫలితాలను విడుదల చేసినా ప్రవేశాలు నిర్వహించడం లేదు. ఎడ్సెట్దీ ఇదే పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.