నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను.. వీడని వాన
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు
చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే బృందం: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం అల్పపీడనమేర్పడి తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం: ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా చిల్లకూరులో 15.4, నాయుడుపేటలో 12.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 7.3, ఇరుగులంలో 7.1, కడప జిల్లా సిద్దవటంలో 6 సెం.మీ. వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటలనుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలమధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా విడవలూరులో 11, నాయుడుపేట 10.7, ఆత్మకూరు 10.2, చిల్లకూరు మండలం చింతవరంలో 8.4, కడప జిల్లా చిట్వేలులో 7.4, చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం ఇరుగులంలో 6.5 సెం.మీ.వర్షపాతం నమోదైంది.గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత పడింది. రోజంతా రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపించింది.
నెల్లూరుజిల్లా పెద్దపడుగుపాడులో వర్షపునీటిలో చింతాలమ్మ అమ్మవారి దేవస్థానం
తిరుమల కనుమ దారిలో జాగ్రత్తలు: తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల-తిరుపతి మధ్య రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదింటికి తితిదే మూసేయించింది. సోమవారం వేకువజామున 2గంటల నుంచి నాలుగుచక్రాల వాహనాలను అనుమతించనున్నారు. నడక మార్గాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు.చిత్తూరు జిల్లాలోని కాళంగి, అరణియార్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తి మండలం కండ్రుగుంట చెరువుకు గండిపడింది. శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోంచి రాళ్లు జారిపడుతుండటంతోరాకపోకలను నియంత్రించారు. వరదయ్యపాళెం మండలం నెలటూరులో గోడకు చెమ్మతో విద్యుత్షాక్ తగిలి ఇంటర్ విద్యార్థి కిషోర్ (17) చనిపోయారు.
ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు
కరప, న్యూస్టుడే: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తడిసిన, మొలకవచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొంటుందని చెప్పారు. కౌలు రైతులకు తీవ్ర నష్టమేర్పడిందని.. పంటల బీమా, పెట్టుబడి రాయితీ ప్రయోజనాలను సీసీఆర్సీ కార్డులు లేనివారికీ అందించేందుకు భూయజమానులు సహకరించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురు, కరప, కూరాడ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. స్వర్ణ రకం పంట సుమారు 80శాతం మేర నష్టమైందని మంత్రి వివరించారు.
కళ్లెదుటే కుప్పకూలిన రెండంతస్తుల భవనం
కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఒరిగిపోతున్న భవనం
రైల్వేకోడూరు, న్యూస్టుడే: కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలింది. షేక్ బాదుల్లా, మహమ్మద్ రఫి, షేక్ ఖాజాబీ, షేక్ నజీర్ కుటుంబాలకు చెందిన భవనమిది. ఇటీవలి వర్షాలకు భవనం పాక్షికంగా దెబ్బతినడంతో వారు బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని బాధితులు తెలిపారు. మరోవైపు కడప జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. కడప నగరం మరోమారు జలమయమైంది.
కూలిన ఇంటి వద్ద షేక్ బాదుల్లా కుటుంబం
సోనూసూద్ ఫౌండేషన్ సాయం
సోనూసూద్ ఫౌండేషన్ సభ్యులు అందజేసిన కిట్లతో తిరుపతిలోని వరద బాధితులు
తిరుపతి వరద బాధితులకు ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలతో పాటు పలు రకాల వస్తువులను అందజేస్తున్నారు. రూ.900 విలువ ఉన్న కిట్లను ఫౌండేషన్ సభ్యుడు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలకమండలి సభ్యుడు మించల ప్రదీప్ ఆధ్వర్యంలో బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 4వేల మంది బాధితులకు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి