నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను.. వీడని వాన
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు
చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే బృందం: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం అల్పపీడనమేర్పడి తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం: ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా చిల్లకూరులో 15.4, నాయుడుపేటలో 12.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 7.3, ఇరుగులంలో 7.1, కడప జిల్లా సిద్దవటంలో 6 సెం.మీ. వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటలనుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలమధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా విడవలూరులో 11, నాయుడుపేట 10.7, ఆత్మకూరు 10.2, చిల్లకూరు మండలం చింతవరంలో 8.4, కడప జిల్లా చిట్వేలులో 7.4, చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం ఇరుగులంలో 6.5 సెం.మీ.వర్షపాతం నమోదైంది.గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత పడింది. రోజంతా రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపించింది.
నెల్లూరుజిల్లా పెద్దపడుగుపాడులో వర్షపునీటిలో చింతాలమ్మ అమ్మవారి దేవస్థానం
తిరుమల కనుమ దారిలో జాగ్రత్తలు: తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల-తిరుపతి మధ్య రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదింటికి తితిదే మూసేయించింది. సోమవారం వేకువజామున 2గంటల నుంచి నాలుగుచక్రాల వాహనాలను అనుమతించనున్నారు. నడక మార్గాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు.చిత్తూరు జిల్లాలోని కాళంగి, అరణియార్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తి మండలం కండ్రుగుంట చెరువుకు గండిపడింది. శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోంచి రాళ్లు జారిపడుతుండటంతోరాకపోకలను నియంత్రించారు. వరదయ్యపాళెం మండలం నెలటూరులో గోడకు చెమ్మతో విద్యుత్షాక్ తగిలి ఇంటర్ విద్యార్థి కిషోర్ (17) చనిపోయారు.
ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు
కరప, న్యూస్టుడే: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తడిసిన, మొలకవచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొంటుందని చెప్పారు. కౌలు రైతులకు తీవ్ర నష్టమేర్పడిందని.. పంటల బీమా, పెట్టుబడి రాయితీ ప్రయోజనాలను సీసీఆర్సీ కార్డులు లేనివారికీ అందించేందుకు భూయజమానులు సహకరించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురు, కరప, కూరాడ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. స్వర్ణ రకం పంట సుమారు 80శాతం మేర నష్టమైందని మంత్రి వివరించారు.
కళ్లెదుటే కుప్పకూలిన రెండంతస్తుల భవనం
కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఒరిగిపోతున్న భవనం
రైల్వేకోడూరు, న్యూస్టుడే: కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలింది. షేక్ బాదుల్లా, మహమ్మద్ రఫి, షేక్ ఖాజాబీ, షేక్ నజీర్ కుటుంబాలకు చెందిన భవనమిది. ఇటీవలి వర్షాలకు భవనం పాక్షికంగా దెబ్బతినడంతో వారు బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని బాధితులు తెలిపారు. మరోవైపు కడప జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. కడప నగరం మరోమారు జలమయమైంది.
కూలిన ఇంటి వద్ద షేక్ బాదుల్లా కుటుంబం
సోనూసూద్ ఫౌండేషన్ సాయం
సోనూసూద్ ఫౌండేషన్ సభ్యులు అందజేసిన కిట్లతో తిరుపతిలోని వరద బాధితులు
తిరుపతి వరద బాధితులకు ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలతో పాటు పలు రకాల వస్తువులను అందజేస్తున్నారు. రూ.900 విలువ ఉన్న కిట్లను ఫౌండేషన్ సభ్యుడు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలకమండలి సభ్యుడు మించల ప్రదీప్ ఆధ్వర్యంలో బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 4వేల మంది బాధితులకు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం