Sirivennela Seetharama Sastry: నీ ఉచ్ఛ్వాసం కవనం.. నీ నిశ్వాసం శోకం
సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలపై అమావాస్య చీకట్లు అలముకున్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచనా రుషి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.
తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి
గతంలో ఊపిరితిత్తుల కేన్సర్కు శస్త్రచికిత్స
ఇటీవల రెండోవైపు మరోసారి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సహా రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం
ఈనాడు - హైదరాబాద్
సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలపై అమావాస్య చీకట్లు అలముకున్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచనా రుషి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. మూడున్నర దశాబ్దాలపాటు తన అక్షరాస్త్రాలతో సామాజిక రుగ్మతలను చెండాడిన కలం యోధుడు కన్నుమూశారు. అభ్యుదయాన్ని జాలువార్చి... ఆశావాదాన్ని రంగరించి... చైతన్యాన్ని ప్రోది చేసి... కుర్రకారుపై చిలిపి ప్రేమలనూ చిలకరించిన సీతారామశాస్త్రి సిరా శాశ్వతంగా ఇంకిపోయింది. ‘చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ...’ అంటూ నింగికెగసిపోయింది. ‘నటరాజస్వామి జటాఝూటిలోకి చేరకుంటే.. విరుచుకుపడు సురగంగకు విలువేముందీ’... అంటూ ‘కల’చాలనం చేసిన సాహితీ శిఖరం ఒరిగిపోయింది. ‘ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్లిన పదాలు... ఝల్లుఝల్లున ఉప్పొంగిన జనహృదయాల’కు తీరని శోకం మిగిల్చింది.
తెలుగుతెరకు వెన్నెలసోన లాంటి పదాలతో అక్షరకాంతులు అద్దిన ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’(66) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూశారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించి తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్రావు తెలిపారు. ‘‘సీతారామశాస్త్రికి ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తులకు కేన్సర్ సోకింది. సర్జరీ చేసి కొంత భాగం తొలగించారు. తర్వాత గుండెలో సమస్య తలెత్తడంతో బైపాస్ సర్జరీ చేశారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తులకు రెండోవైపు కేన్సర్ కన్పించింది. బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చేరడంతో సర్జరీ చేసి కొంత భాగం తొలగించారు. రెండురోజుల వరకు ఆరోగ్యం నిలకడగానే ఉంది. తర్వాత న్యుమోనియా, ఇతర సమస్యలు తలెత్తాయి. నవంబరు 24న కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలి రెండు రోజులు చికిత్సకు స్పందించారు. న్యుమోనియా ఇతర సమస్యలతో ఆక్సిజన్ సక్రమంగా అందలేదు. దీంతో ఎక్మో యంత్రం సాయం అందించాం. అయిదు రోజుల నుంచి ఆయన ఎక్మోపైనే చికిత్స పొందారు. ఇప్పటికే కేన్సర్ సోకడం.. గతంలో బైపాస్ సర్జరీ.. దీనికితోడు అధిక బరువు ఇతర సమస్యలతోపాటు కిడ్నీలు విఫలమయ్యాయి. కిమ్స్ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు’’ అని డాక్టర్ భాస్కర్రావు వివరించారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
‘సిరివెన్నెల’ చిత్రంతో విధాత తలపున.. పాటతో ప్రాచుర్యం పొందిన ఆయన ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు రచించిన సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 11 నంది పురస్కారాలు ఆయనకు దక్కాయి. తన పాటలతో తెలుగు ప్రేక్షకుడి స్థాయిని పెంచిన శాస్త్రి 1955 మే 20న చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ప్రథమ సంతానంగా మధ్యప్రదేశ్లోని శివనిలో జన్మించారు. ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం అనకాపల్లిలో జరిగాయి. కాకినాడలో ఇంటర్మీడియట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో చేరారు. ఏడాది పూర్తయ్యాక టెలికంలో అసిస్టెంట్గా ఉద్యోగం రావడంతో చదువుకు స్వస్తి పలికి అందులో చేరారు. రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, కాకినాడలలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా అందుకున్నారు. ఎంఏ ప్రథమ సంవత్సరంలో చదువు ముగించారు. కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ఏర్పడిన సాహితీ పరిచయాలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. ‘భరణి’ అనే కలం పేరుతో పత్రికల్లో కథలు, కవితలు రాసిన ఆయన.. మిత్రులు, సోదరుడి ప్రోత్సాహంతో రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. మొదట బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో సీతారామశాస్త్రి సినీ ప్రయాణం మొదలైనా, ‘సిరివెన్నెల’ పాటలతోనే ఆయనకు గుర్తింపు లభించింది. ఆ సినిమాలోని ‘విధాత తలపున..’ పాటకు తొలి నంది పురస్కారం లభించింది. ఆపై కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ పాటలు రచించారు. కళాతపస్వితో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెలను ప్రేమగా సీతారాముడు అని పిలిచేవారు. మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న ‘సిరివెన్నెల’ సినీ ప్రయాణం ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఇటీవలి ‘నారప్ప’, ‘కొండపొలం’, ‘ఆర్.ఆర్.ఆర్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలకూ ఆయన పాటలు రాశారు.
జగమంత కుటుంబం ఆయనది..
‘చక్రం’ సినిమా కోసం ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అంటూ తన కలాన్ని కదిలించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అందుకు తగ్గట్టే జగమంత తెలుగు కుటుంబాన్ని, వాళ్ల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నారు. ‘సిరివెన్నెల’ పాట లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు, కథానాయకులు చాలామందే ఉన్నారు. ఆయనకు భార్య పద్మావతి, కుమార్తె లలితాదేవి, కుమారులు సాయి వెంకట యోగేశ్వరశర్మ, రాజా భవానీ శంకరశర్మ (రాజా) ఉన్నారు. యోగేశ్వరశర్మ సంగీత దర్శకుడిగా, రాజా నటుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ వీరికి దగ్గరి బంధువు. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలోనూ సీతారామశాస్త్రి పాట ఉండాల్సిందే అంటుంటారు త్రివిక్రమ్.
పాటలకు కిరీటాలు..
‘సిరివెన్నెల’లోని ‘విధాత తలపున’., ‘శ్రుతిలయలు’లోని ‘తెలవారదేమో స్వామి’, ‘స్వర్ణకమలం’లోని ‘అందెల రవమిది పదములదా’.., ‘గాయం’లోని ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’.., ‘శుభలగ్నం’లోని ‘చిలకా ఏ తోడు లేకా’.., ‘శ్రీకారం’ సినిమాలోని ‘మనసు కాస్త కలత పడితే’.., ‘సిందూరం’లోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’.., ‘ప్రేమకథ’లోని ‘దేవుడు కనిపిస్తాడని’.., ‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది’.., ‘గమ్యం’లోని ‘ఎంత వరకు ఎందు కొరకు’.., ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని ‘మరీ అంతగా..’ పాటలకుగానూ సిరివెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు దక్కాయి.
నేడు అంత్యక్రియలు..
సిరివెన్నెల భౌతిక కాయానికి బుధవారం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణంలో ఉంచనునున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తెలుగు సినిమా పాటకు రెండు కళ్లలాంటి వారు వేటూరి, సిరివెన్నెల. వేటూరి మనకు ఇదివరకే దూరం కాగా, ఇప్పుడు సిరివెన్నెల సెలవు పలకడంతో తెలుగు పాట విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల ఇక లేరని తెలియగానే చిత్రసీమ మూగబోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!