30,000 లారీల సీజ్!
కొవిడ్ ప్రభావం సరకు రవాణా రంగంపై తీవ్రంగా పడింది. అనేక పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు చేయకపోవడం, కిరాయిలు లేకపోవడంతో లారీల యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కిరాయిలు గిట్టుబాటుకాక పోవడమూ సమస్యగా మారింది.
వాయిదాలు కట్టలేకపోవడంతో జప్తుచేసిన ఆర్థిక సంస్థలు
కొవిడ్ దెబ్బకు సరకు రవాణా రంగం విలవిల
వాహనాలకు గిరాకీ లేక యజమానులకు అవస్థలు
వేలాది మంది ఉపాధికి గండి
ఈనాడు, అమరావతి: కొవిడ్ ప్రభావం సరకు రవాణా రంగంపై తీవ్రంగా పడింది. అనేక పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు చేయకపోవడం, కిరాయిలు లేకపోవడంతో లారీల యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కిరాయిలు గిట్టుబాటు
కాక పోవడమూ సమస్యగా మారింది. మూడు, నాలుగు నెలలుగా పరిస్థితులు చక్కబడుతున్నాయని భావిస్తున్న తరుణంలో.. మళ్లీ ఇపుడు కొవిడ్ మూడో దశ ఆందోళనకు గురిచేస్తోంది. గత పరిస్థితులు పునరావృతమైతే...రవాణా వ్యాపారాన్ని వదిలేసుకోవాల్సి వస్తుందని లారీల యజమానులు చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు లక్షల లారీలు ఉంటే.. అందులో 30 వేలకు పైనే (10 శాతం) లారీలకు వాయిదాలు (లారీల కొనుగోలుకు తీసుకున్న రుణాలకు) చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. మరి కొందరు యజమానులు ఈ పరిస్థితులు తట్టుకోలేక లారీలను అమ్మేసుకున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందే అనేక మందికి పని లేకుండా పోయింది. 2019లో ఒక్కసారిగా రాష్ట్రంలో నిర్మాణరంగంలో అనిశ్చితి నెలకొంది. 2020 ఆరంభంలో కొవిడ్ తొలిదశ ఆరంభం, మార్చిలో లాక్డౌన్తో సరకు రవాణారంగం పై తీవ్ర ప్రభావం మొదలైంది. మొదటిదశ తర్వాత కొంత వరకే లారీలు రోడ్డెక్కాయి. ఇంతలో కొవిడ్ రెండో దశతో మరోసారి డీలా పడ్డాయి. డీజిల్ ధరలు కూడా అమాంతం పెరగడంతో కిరాయిలు గిట్టుబాటు కాకుండా చేసింది. అయితే గత ఏడాది చివర్లో కొంత పురోగతి కనిపించింది. ఇంతలో మూడో దశరూపంలో మరోసారి ఆందోళన నెలకొంటోంది.
కొవిడ్ రెండు దశల్లోనూ రాత్రి కర్ఫ్యూలు కారణంగా కొన్నిచోట్ల సరకు రవాణా వాహనాలను పోలీసులు నిలిపేసేవారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు లోడుతో వెళ్లిన లారీలకు ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. దూర ప్రాంతాలకు వెళితే తిరుగు ప్రయాణానికి కిరాయిలు లభించక వారంపాటు అక్కడే వెచిఉండాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా పలు రాష్ట్రాలు, వివిధ నగరాల్లో వారాంతపు లాక్డౌన్లు, రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. దీంతో మరోసారి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
లారీలు అమ్మేసి డ్రైవర్ అయ్యాను
ఒక లారీతో మొదలుపెట్టి అయిదు లారీలకు యజమాని అయ్యాను. నావద్ద డ్రైవర్లు క్లీనర్లు కలిపి కనీసం 10 మంది పనిచేసేవారు. కొవిడ్ ప్రభావం కారణంగా కిరాయిలు లేక రెండేళ్లలో లారీలన్నీ అమ్మేశాను. ఇప్పుడు ఓ సంస్థలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.
- కన్నారెడ్డి, విజయవాడ
సీజ్ చేసిన వాటినీ అమ్మలేని పరిస్థితి
రాష్ట్రంలో మూడు లక్షల లారీలు ఉండగా.. కొవిడ్ ప్రభావంతో వీటిలో 2 లక్షల లారీలకు కిరాయిలు అంతంతమాత్రంగా లభించేవి. వాయిదాలు చెల్లించకపోవడంతో పలు ఫైనాన్స్ సంస్థలు 30 వేలకుపైగా లారీలను సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్నాయి. ముఖ్యంగా ఒకటి, రెండు లారీలు కలిగిన యజమానులు ఫైనాన్స్ సంస్థలకు లారీలను వదులుకున్నారు. సీజ్చేసిన లారీలను సైతం కొనేవారు లేకపోవడంతో కొన్ని ఫైనాన్స్ సంస్థలు మాత్రం రుణాల చెల్లింపునకు గడువు ఇస్తున్నాయి.
మూడింతలు పడిపోయిన అమ్మకాలు
లారీల విక్రయాలు గత రెండేళ్లుగా దారుణంగా పడిపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఏటా సగటున 2 వేలకుపైన లారీలను విక్రయించేవాళ్లం. కొవిడ్ ప్రభావంతో 2020లో 400 లారీలు, 2021లో 440 లారీలు మాత్రమే విక్రయించగలిగాం. ఇపుడు మళ్లీ మూడో దశతో ఈ ఏడాది కూడా పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు’ అని ఓ ప్రముఖ కంపెనీ డీలర్ పేర్కొన్నారు.
లారీలకు ఫైనాన్స్ దాదాపు తగ్గించాం
గతంలో ఏటా 1,500 వాహనాలకు ఫైనాన్స్ చేసేవాళ్లం. ఇందులో 50-60 శాతం భారీ వాహనాలు ఉండేవి. ఇపుడు చిన్న వాహనాలకే ఫైనాన్స్ ఇస్తున్నాం. భారీ వాహనాలకు కేవలం 5-10 శాతమే ఫైనాన్స్ చేస్తున్నాం.
-ఓ వాహన ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుడు, విజయవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!