ప్రపంచం 5జీ హుజూర్
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ప్రజల దైనందిన జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. అరచేతిలోనే సమస్త ప్రపంచం ఉంటుందని, భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలటిక్స్, ఇంçËర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్య, వైద్యం, వ్యవసాయంలో కీలకం కానున్నాయని
5జీ టెక్నాలజీతో జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు
కీలక రంగాలన్నిటిపైనా ప్రభావం
‘ఈనాడు’తో టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ప్రజల దైనందిన జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. అరచేతిలోనే సమస్త ప్రపంచం ఉంటుందని, భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్య, వైద్యం, వ్యవసాయంలో కీలకం కానున్నాయని పేర్కొన్నారు. 5జీతో అత్యధిక వేగంతో ఇంటర్నెట్, పౌరసేవలు విస్తృతంగా అందించేందుకు వీలవుతుందన్నారు. నెట్వర్క్ లేని గ్రామాల్లో వైర్లెస్ బ్లాక్హోల్ టెక్నాలజీతో అంతరాయం లేకుండా ఆన్లైన్ విద్యను అందించవచ్చన్నారు. గత 3 దశాబ్దాలుగా అమెరికాలో పరిశోధన రంగంలో ఉన్న కల్యాణి వెరైజెన్ టెక్నాలజీ సంస్థలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తూ 5జీ టెక్నాలజీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. విజయవాడకు చెందిన ఈమె 1977లో తిరుపతిలోని ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో చేరారు. బెంగళూరులోని ఐఐఎస్ఇలో పీజీ, తర్వాత అమెరికాలోని యూనివరిటీ ఆఫ్ బఫ్లోలో పీహెచ్డీ చేశారు. అక్కడే టెక్నాలజీ రంగంలో విస్తృతంగా పరిశోధన చేసిన ఈమె 70కి పైగా పేటెంట్లు పొందడంతోపాటు 35 ప్రచురణలు చేశారు. రానున్న కాలంలో 5జీ టెక్నాలజీ కీలకంగా మారనున్న నేపథ్యంలో ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ఈ సాంకేతికతతో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి?
ఆర్థిక, సామాజిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. టెలికం రంగం గత 30 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. 2జీ వైర్లైన్, వైర్లెస్ వాయిస్తో మొదలై, 3జీలో ఆన్ డిమాండ్ ఇంటర్నెట్గా మారి.. 4జీతో నిరంతరం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వేగవంతమైన బ్యాండ్విడ్త్ అవసరం. ఈ సమస్యను 5జీ తీర్చుతుంది. దీంతో వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీ పరిజ్ఞానాలు విస్తృతం కానున్నాయి. ఇప్పటికే గేమ్లతో పాటు కొన్ని యాప్లు వచ్చాయి. ఉదాహరణకు ఒక గేమ్ ఆడుతున్నపుడు మనం ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లిన అనుభూతి కలుగుతుంది. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, అడవిలో వన్యప్రాణుల వంటి దృశ్యాలు కూడా స్వయంగా పక్కనే ఉండి చూస్తున్నట్లు ఉంటుంది. దీని కోసం గ్లాస్లు, ఇతర తెరలు అవసరమవుతాయి. మొబైల్ బ్రాడ్బాండ్ సామర్థ్యంతో పాటు ఎక్కువ సామర్థ్యం గల డేటాను సులభంగా, వేగంగా పంపడం, డౌన్లోడ్ చేసుకోవడం సహా అనేక ప్రయోజనాలున్నాయి.
కొత్త టెక్నాజీలతో యాంత్రీకరణ, ఉద్యోగాలపై ప్రభావం ఎలా ఉంటుంది
కొత్త టెక్నాలజీలతో నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుంది. కర్మాగారాల స్వరూపం మారిపోతుంది. రోబోల వినియోగం పెరుగుతుంది. మనుషులు చేసే పనుల్లో అనేకం రోబోలు చేస్తాయి. వ్యవసాయంలోనూ కృత్రిమ మేధ, ఐవోటీ వినియోగం పెరుగుతోంది. పంటలకు ఎప్పుడు నీరు పెట్టాలి.. ఎప్పుడు మందులు చల్లాలి.. ఇవన్నీ మొదలయ్యాయి. త్వరలోనే రోబోటిక్స్, సెన్సర్లతో వ్యవసాయం మరింత కొత్తపుంతలు తొక్కనుంది. ఈ పరిజ్ఞానమంతా ఆర్థిక పురోగతితోపాటు కొత్త ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది.
భారత్లో 5జీ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది
భారత్లో 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉండాలి. ఈ స్పెక్ట్రమ్ను టెలికం కంపెనీలు కొనుగోలు చేసి, వాటిపై సేవలను అందిస్తాయి. ఆ మేరకు 5జీ టవర్లు పెట్టాలి. డేటా సెంటర్లలో అప్గ్రేడ్ చేయాలి. ఫోన్లలో చిప్సెట్లు, యాప్లు 5జీకి మారాలి. మొబిలిటీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఏ టెక్నాలజీ అయినా, ప్రారంభమైన తరువాత పూర్తిస్థాయి వినియోగ స్థాయికి చేరేందుకు కనీసం పదేళ్ల సమయం పడుతుంది.
ఆధునిక సాంకేతికత ఫలాలు అందరికీ చేరువయ్యేదెలా
ప్రజలందరికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. మెసేజ్, వీడియో, ఆడియో వాయిస్లతో పాటు నిర్మాణ, ఆరోగ్య, రవాణా, ఆర్థిక, విద్య సంబంధిత అప్లికేషన్లపై వారికి అవగాహన కల్పించాలి. వాట్సప్ సామాన్య ప్రజలు కూడా తేలిగ్గా ఉపయోగించుకునేలా ఉంది. అదేస్థాయిలో డెవలపర్లు మిగతా రంగాల యాప్లను అభివృద్ధి చేయాలి. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆన్లైన్లో ఎన్నో కోర్సులు వస్తున్నాయి. వాటిని త్వరగా నేర్చుకోవచ్చు. చాలా మంది ఉద్యోగంలో చేరాక, కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టడం లేదు. ఇలా చేస్తే ఉద్యోగంలో ముందుకెళ్లలేం. సెల్ఫోన్, యాప్లు పూర్తిస్థాయిలో వాడగలిగేవారెవరికైనా భవిష్యత్తులో అన్ని పనులూ సులభమవుతాయి. విద్య, వైద్యం సహా దైనందిన అవసరాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది.
భవిష్యత్తు టెక్నాలజీలతో అనుసంధానం వల్ల ఎలాంటి సేవలు పొందవచ్చు
ప్రస్తుతం భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ కీలకం. ఇవి అన్ని రంగాల్లో ప్రభావం చూపనున్నాయి. ఉదాహరణకు ఏదైనా ఒక ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎదురైనప్పుడు వేగంగా పరిష్కార మార్గాలను ఎస్ఎంఎస్ల రూపంలో పంపించవచ్చు. ఇంట్లోని ఏసీ, టీవీ ఇతర వస్తువులను మొబైల్ ఫోన్తో నియంత్రించవచ్చు. తాగునీరు, డ్రైనేజీ పైపులకు సెన్సర్లు అనుసంధానం చేసి, ఎక్కడ సమస్య ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, తక్షణ సాయం, రక్షణ, నష్టాల అంచనా వంటి చర్యలకు చాలా ఉపయోగపడుతుంది. సెల్టవర్లలో సాంకేతిక సమస్యల్ని రోబోలు, డ్రోన్లతో పరిష్కరించవచ్చు. ఆన్లైన్ విద్యావిధానం మరింతగా మారిపోతుంది. గతంలో ఆసుపత్రికి వెళ్లి నిరీక్షించేవాళ్లం. ఇప్పుడు యాప్లో సమస్యలను నమోదు చేస్తే అవసరమైన వైద్యులు ఆన్లైన్లోకి వచ్చి సేవలు అందిస్తారు. 5జీతో 4జీ కంటే చాలా రెట్లు ఎక్కువగా, వేగంగా సమాచారం పొందవచ్చు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు