ప్రపంచం 5జీ హుజూర్
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ప్రజల దైనందిన జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. అరచేతిలోనే సమస్త ప్రపంచం ఉంటుందని, భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలటిక్స్, ఇంçËర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్య, వైద్యం, వ్యవసాయంలో కీలకం కానున్నాయని
5జీ టెక్నాలజీతో జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు
కీలక రంగాలన్నిటిపైనా ప్రభావం
‘ఈనాడు’తో టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ప్రజల దైనందిన జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కల్యాణి బోగినేని తెలిపారు. అరచేతిలోనే సమస్త ప్రపంచం ఉంటుందని, భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్య, వైద్యం, వ్యవసాయంలో కీలకం కానున్నాయని పేర్కొన్నారు. 5జీతో అత్యధిక వేగంతో ఇంటర్నెట్, పౌరసేవలు విస్తృతంగా అందించేందుకు వీలవుతుందన్నారు. నెట్వర్క్ లేని గ్రామాల్లో వైర్లెస్ బ్లాక్హోల్ టెక్నాలజీతో అంతరాయం లేకుండా ఆన్లైన్ విద్యను అందించవచ్చన్నారు. గత 3 దశాబ్దాలుగా అమెరికాలో పరిశోధన రంగంలో ఉన్న కల్యాణి వెరైజెన్ టెక్నాలజీ సంస్థలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తూ 5జీ టెక్నాలజీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. విజయవాడకు చెందిన ఈమె 1977లో తిరుపతిలోని ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో చేరారు. బెంగళూరులోని ఐఐఎస్ఇలో పీజీ, తర్వాత అమెరికాలోని యూనివరిటీ ఆఫ్ బఫ్లోలో పీహెచ్డీ చేశారు. అక్కడే టెక్నాలజీ రంగంలో విస్తృతంగా పరిశోధన చేసిన ఈమె 70కి పైగా పేటెంట్లు పొందడంతోపాటు 35 ప్రచురణలు చేశారు. రానున్న కాలంలో 5జీ టెక్నాలజీ కీలకంగా మారనున్న నేపథ్యంలో ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ఈ సాంకేతికతతో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి?
ఆర్థిక, సామాజిక రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. టెలికం రంగం గత 30 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. 2జీ వైర్లైన్, వైర్లెస్ వాయిస్తో మొదలై, 3జీలో ఆన్ డిమాండ్ ఇంటర్నెట్గా మారి.. 4జీతో నిరంతరం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వేగవంతమైన బ్యాండ్విడ్త్ అవసరం. ఈ సమస్యను 5జీ తీర్చుతుంది. దీంతో వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీ పరిజ్ఞానాలు విస్తృతం కానున్నాయి. ఇప్పటికే గేమ్లతో పాటు కొన్ని యాప్లు వచ్చాయి. ఉదాహరణకు ఒక గేమ్ ఆడుతున్నపుడు మనం ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లిన అనుభూతి కలుగుతుంది. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, అడవిలో వన్యప్రాణుల వంటి దృశ్యాలు కూడా స్వయంగా పక్కనే ఉండి చూస్తున్నట్లు ఉంటుంది. దీని కోసం గ్లాస్లు, ఇతర తెరలు అవసరమవుతాయి. మొబైల్ బ్రాడ్బాండ్ సామర్థ్యంతో పాటు ఎక్కువ సామర్థ్యం గల డేటాను సులభంగా, వేగంగా పంపడం, డౌన్లోడ్ చేసుకోవడం సహా అనేక ప్రయోజనాలున్నాయి.
కొత్త టెక్నాజీలతో యాంత్రీకరణ, ఉద్యోగాలపై ప్రభావం ఎలా ఉంటుంది
కొత్త టెక్నాలజీలతో నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తుంది. కర్మాగారాల స్వరూపం మారిపోతుంది. రోబోల వినియోగం పెరుగుతుంది. మనుషులు చేసే పనుల్లో అనేకం రోబోలు చేస్తాయి. వ్యవసాయంలోనూ కృత్రిమ మేధ, ఐవోటీ వినియోగం పెరుగుతోంది. పంటలకు ఎప్పుడు నీరు పెట్టాలి.. ఎప్పుడు మందులు చల్లాలి.. ఇవన్నీ మొదలయ్యాయి. త్వరలోనే రోబోటిక్స్, సెన్సర్లతో వ్యవసాయం మరింత కొత్తపుంతలు తొక్కనుంది. ఈ పరిజ్ఞానమంతా ఆర్థిక పురోగతితోపాటు కొత్త ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది.
భారత్లో 5జీ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది
భారత్లో 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉండాలి. ఈ స్పెక్ట్రమ్ను టెలికం కంపెనీలు కొనుగోలు చేసి, వాటిపై సేవలను అందిస్తాయి. ఆ మేరకు 5జీ టవర్లు పెట్టాలి. డేటా సెంటర్లలో అప్గ్రేడ్ చేయాలి. ఫోన్లలో చిప్సెట్లు, యాప్లు 5జీకి మారాలి. మొబిలిటీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఏ టెక్నాలజీ అయినా, ప్రారంభమైన తరువాత పూర్తిస్థాయి వినియోగ స్థాయికి చేరేందుకు కనీసం పదేళ్ల సమయం పడుతుంది.
ఆధునిక సాంకేతికత ఫలాలు అందరికీ చేరువయ్యేదెలా
ప్రజలందరికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. మెసేజ్, వీడియో, ఆడియో వాయిస్లతో పాటు నిర్మాణ, ఆరోగ్య, రవాణా, ఆర్థిక, విద్య సంబంధిత అప్లికేషన్లపై వారికి అవగాహన కల్పించాలి. వాట్సప్ సామాన్య ప్రజలు కూడా తేలిగ్గా ఉపయోగించుకునేలా ఉంది. అదేస్థాయిలో డెవలపర్లు మిగతా రంగాల యాప్లను అభివృద్ధి చేయాలి. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆన్లైన్లో ఎన్నో కోర్సులు వస్తున్నాయి. వాటిని త్వరగా నేర్చుకోవచ్చు. చాలా మంది ఉద్యోగంలో చేరాక, కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టడం లేదు. ఇలా చేస్తే ఉద్యోగంలో ముందుకెళ్లలేం. సెల్ఫోన్, యాప్లు పూర్తిస్థాయిలో వాడగలిగేవారెవరికైనా భవిష్యత్తులో అన్ని పనులూ సులభమవుతాయి. విద్య, వైద్యం సహా దైనందిన అవసరాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది.
భవిష్యత్తు టెక్నాలజీలతో అనుసంధానం వల్ల ఎలాంటి సేవలు పొందవచ్చు
ప్రస్తుతం భవిష్యత్తు టెక్నాలజీలైన కృత్రిమమేధ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ కీలకం. ఇవి అన్ని రంగాల్లో ప్రభావం చూపనున్నాయి. ఉదాహరణకు ఏదైనా ఒక ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎదురైనప్పుడు వేగంగా పరిష్కార మార్గాలను ఎస్ఎంఎస్ల రూపంలో పంపించవచ్చు. ఇంట్లోని ఏసీ, టీవీ ఇతర వస్తువులను మొబైల్ ఫోన్తో నియంత్రించవచ్చు. తాగునీరు, డ్రైనేజీ పైపులకు సెన్సర్లు అనుసంధానం చేసి, ఎక్కడ సమస్య ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, తక్షణ సాయం, రక్షణ, నష్టాల అంచనా వంటి చర్యలకు చాలా ఉపయోగపడుతుంది. సెల్టవర్లలో సాంకేతిక సమస్యల్ని రోబోలు, డ్రోన్లతో పరిష్కరించవచ్చు. ఆన్లైన్ విద్యావిధానం మరింతగా మారిపోతుంది. గతంలో ఆసుపత్రికి వెళ్లి నిరీక్షించేవాళ్లం. ఇప్పుడు యాప్లో సమస్యలను నమోదు చేస్తే అవసరమైన వైద్యులు ఆన్లైన్లోకి వచ్చి సేవలు అందిస్తారు. 5జీతో 4జీ కంటే చాలా రెట్లు ఎక్కువగా, వేగంగా సమాచారం పొందవచ్చు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!