వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్
రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంలో కోత పెట్టింది.
సొమ్ములు వెనక్కివ్వాల్సిందే
భవిష్య డీఆర్ల నుంచి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారికి భారీ నష్టం
ఈనాడు - అమరావతి
రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంలో కోత పెట్టింది. దీంతోపాటు ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించడంతో వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం కన్నా ఇప్పటికే వారు అధికంగా తీసుకున్నారని ప్రభుత్వం లెక్క తేలుస్తోంది. ఇలా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ (డీఆర్ -కరవు సాయం) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది. ఈ కారణాలతో దాదాపు రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు నష్టపోతున్న పింఛనుదార్లు కూడా ఉన్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇవీ వివరాలు...
కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది. పింఛనుదార్లకు కొత్త స్కేళ్లు... ఎంత మొత్తం పింఛను అందుతుంది... ఇప్పటికే అధికంగా ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని, డీఆర్ నుంచి ఎలా మినహాయిస్తారు వంటి అంశాలను జీవోల్లో పేర్కొంది. పింఛనుదార్లకు ఉద్దేశించిన జీవో-2లో 19.3 నిబంధన ప్రకారం ఇప్పటికే అదనంగా చెల్లించిన మధ్యంతర భృతిని డీఆర్ బకాయిల మొత్తం నుంచి మినహాయిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ అలా మినహాయించినా ఇంకా సరిపోని పక్షంలో... ఆ పింఛనుదారు నుంచి ప్రభుత్వానికి ఇంకా జమ కావాల్సిన మొత్తం ఉంటే భవిష్యత్తులో ఇచ్చే డీఆర్ నుంచి మినహాయించుకుంటామని స్పష్టంచేసింది. అంటే 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న చాలామంది పింఛనుదార్లు కొత్త విధానంతో ప్రభుత్వానికే బకాయి పడే పరిస్థితి ఏర్పడుతోంది. వారెవరికీ భవిష్యత్తులో ప్రతి ఆరు నెలలకు ఇచ్చే డీఆర్ మొత్తాలు అందే అవకాశమే లేదని ఈ జీవోను పరిశీలించిన సీనియర్ పింఛనుదార్లు వాపోతున్నారు.
మినహాయింపులను లెక్కగట్టి...
కొత్త పింఛన్ ఎలా లెక్క కట్టాలి, అందులో నుంచి ఐఆర్ అదనపు మొత్తాన్ని ఎలా మినహాయిస్తారన్న విషయాన్ని ప్రభుత్వమే స్పష్టంగా పట్టిక రూపంలో విశదీకరించింది. 70 ఏళ్ల లోపు ఉన్న వారికి ఎలా ఉంటుంది? 70 నుంచి 75 ఏళ్లలోపు, 75 నుంచి 80 ఏళ్లలోపు వారికి ఎలా? ఆ తర్వాత వయసు వారికి ఎలా లెక్కగడతామన్న అంశాలను ఆయా జీవోలలో ఆర్థికశాఖ స్పష్టంగా వివరించింది. వాటిని పరిశీలిస్తే..
70 ఏళ్లు దాటిన పింఛనుదారుకు....
70 ఏళ్లు దాటిన పింఛనర్కు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాదు. ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రకారమే వారి కొత్త పింఛను ఎలా లెక్కిస్తారో ఆర్థికశాఖ వివరించింది.
* పాత పేస్కేళ్ల ప్రకారం రూ.25,840 మూల పింఛను ఉన్న పింఛనుదారు 2021 డిసెంబరు వరకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, 33.536 శాతం డీఏతో కలిపి, మధ్యంతర భృతితో కూడా లెక్క వేస్తే రూ.10,06,385 మొత్తం స్వీకరించారు. ఇందులో ఐఆర్గా స్వీకరించిన మొత్తం రూ.2,09,304గా తేల్చారు.
* ప్రస్తుతం ఆయనకు 2020 ఏప్రిల్ నుంచి కొత్త స్కేళ్లు లెక్కించారు. కొత్త మూల పింఛన్ను రూ.37,956గా లెక్కగట్టారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేనందున పైసా కూడా ఆ కేటగిరీలో లెక్క కట్టలేదు. 2021 జూన్ వరకు 7.28% చొప్పున డీఆర్ లెక్కకట్టారు. 2021 నుంచి 20.02% చొప్పున డీఆర్ లెక్కగట్టారు. ఫిట్మెంట్ 23% చొప్పున, పాత డీఏ మొత్తం కలిపి కొత్త మూల పింఛన్గా తేల్చినందున ఇక మధ్యంతర భృతిని లెక్కించలేదు. ఆ రూపేణా మొత్తం కొత్త పింఛను స్కేలు ప్రకారం ఆ పింఛనుదారుకు రూ.9,23,261 వస్తుంది. డీఆర్ బకాయిలను రూ.12,186గా లెక్కించారు. ఈ మొత్తాన్ని కలిపి కొత్త పింఛను స్కేళ్లు, నిబంధనల ప్రకారం మొత్తం రూ.9,35,447 రావాల్సి ఉందని నిర్ణయిచారు.
* పాత స్కేళ్ల ప్రకారం అందుకున్న రూ.10,06,386 నుంచి కొత్త స్కేళ్ల ప్రకారం రావాల్సింది తక్కువే (రూ.9,35,447) ఉండటంతో మినహాయించారు. ఈ పింఛనుదారు ప్రభుత్వానికి ఇంకా రూ.70,939 బకాయి పడ్డారు. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో ఇచ్చే డీఆర్ నుంచి మినహాయిస్తామని జీవోనే 19.3 నిబంధన స్పష్టంగా పేర్కొంది.
75 ఏళ్లు దాటిన వారికి ఇలా...
ఇదే జీవోలోని మరో పట్టికలో 75 ఏళ్లు దాటిన వారి పరిస్థితిని వివరించారు. పాత విధానంలో రూ.25,840 పాత మూల పింఛన్ ఉండి కొత్త మూల పింఛన్ రూ.39,682గా ఉన్న పింఛనుదారు రూ.1,07,170 ప్రభుత్వానికి బకాయి పడ్డారు. ఈయనకు భవిష్యత్తులో డీఆర్ అందదు.
* 70 ఏళ్ల వయసులోపు వారికి కొత్త లెక్కల ప్రకారం ఎంత బకాయి రానుందో లెక్కించారు. రూ.25,840 మూల పింఛన్ పొందేవారికి రూ.1,523 మేర బకాయిలు అందుతాయన్నారు.
* 80 నుంచి 85 ఏళ్ల మధ్య వారికీ ఇదే మూల పింఛన్ ఉంటే... వారికి రూ.41,251 పాత బకాయిల రూపంలో లభిస్తుంది.
* 85 నుంచి 90 ఏళ్ల మధ్య వారికి ఇదే మూల పింఛన్ ప్రకారం లెక్కిస్తే రూ.97,346 మేర బకాయిల రూపంలో అందుతుంది.
* 90 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఇదే మూల పింఛన్ ప్రకారం రూ.1,53,442 బకాయిగా అందుతుంది.
* 95-100 ఏళ్ల పైబడి వారికి ఇదే మూల పింఛన్ వద్ద 2,09,537 బకాయిగా అందుతుంది.
* అదే 100 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.5,62,474 మేర బకాయిలు అందుతాయని పేర్కొంది.
అంత్యక్రియల ఖర్చుల్లోనూ కోత
పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం అంత్యక్రియల ఖర్చులు చెల్లిస్తోంది. ఇంతవరకు ఒక నెల పింఛను ఇస్తోంది. కనీస మొత్తం రూ.15 వేలు ఉండేలా చెల్లించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని పేర్కొన్నారు. గతంలో నెల మొత్తం పింఛను ఎంత ఉంటే అంత పొందేవారు ఇకపై రూ.20 వేలకు మించి పొందరు. నెల పింఛను 25 వేలకు మించి ఉన్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కుటుంబాలు తాజా ఉత్తర్వులతో నష్టపోనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్