వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్
రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంలో కోత పెట్టింది.
సొమ్ములు వెనక్కివ్వాల్సిందే
భవిష్య డీఆర్ల నుంచి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారికి భారీ నష్టం
ఈనాడు - అమరావతి
రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంలో కోత పెట్టింది. దీంతోపాటు ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించడంతో వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం కన్నా ఇప్పటికే వారు అధికంగా తీసుకున్నారని ప్రభుత్వం లెక్క తేలుస్తోంది. ఇలా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ (డీఆర్ -కరవు సాయం) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది. ఈ కారణాలతో దాదాపు రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు నష్టపోతున్న పింఛనుదార్లు కూడా ఉన్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇవీ వివరాలు...
కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది. పింఛనుదార్లకు కొత్త స్కేళ్లు... ఎంత మొత్తం పింఛను అందుతుంది... ఇప్పటికే అధికంగా ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని, డీఆర్ నుంచి ఎలా మినహాయిస్తారు వంటి అంశాలను జీవోల్లో పేర్కొంది. పింఛనుదార్లకు ఉద్దేశించిన జీవో-2లో 19.3 నిబంధన ప్రకారం ఇప్పటికే అదనంగా చెల్లించిన మధ్యంతర భృతిని డీఆర్ బకాయిల మొత్తం నుంచి మినహాయిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ అలా మినహాయించినా ఇంకా సరిపోని పక్షంలో... ఆ పింఛనుదారు నుంచి ప్రభుత్వానికి ఇంకా జమ కావాల్సిన మొత్తం ఉంటే భవిష్యత్తులో ఇచ్చే డీఆర్ నుంచి మినహాయించుకుంటామని స్పష్టంచేసింది. అంటే 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న చాలామంది పింఛనుదార్లు కొత్త విధానంతో ప్రభుత్వానికే బకాయి పడే పరిస్థితి ఏర్పడుతోంది. వారెవరికీ భవిష్యత్తులో ప్రతి ఆరు నెలలకు ఇచ్చే డీఆర్ మొత్తాలు అందే అవకాశమే లేదని ఈ జీవోను పరిశీలించిన సీనియర్ పింఛనుదార్లు వాపోతున్నారు.
మినహాయింపులను లెక్కగట్టి...
కొత్త పింఛన్ ఎలా లెక్క కట్టాలి, అందులో నుంచి ఐఆర్ అదనపు మొత్తాన్ని ఎలా మినహాయిస్తారన్న విషయాన్ని ప్రభుత్వమే స్పష్టంగా పట్టిక రూపంలో విశదీకరించింది. 70 ఏళ్ల లోపు ఉన్న వారికి ఎలా ఉంటుంది? 70 నుంచి 75 ఏళ్లలోపు, 75 నుంచి 80 ఏళ్లలోపు వారికి ఎలా? ఆ తర్వాత వయసు వారికి ఎలా లెక్కగడతామన్న అంశాలను ఆయా జీవోలలో ఆర్థికశాఖ స్పష్టంగా వివరించింది. వాటిని పరిశీలిస్తే..
70 ఏళ్లు దాటిన పింఛనుదారుకు....
70 ఏళ్లు దాటిన పింఛనర్కు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాదు. ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రకారమే వారి కొత్త పింఛను ఎలా లెక్కిస్తారో ఆర్థికశాఖ వివరించింది.
* పాత పేస్కేళ్ల ప్రకారం రూ.25,840 మూల పింఛను ఉన్న పింఛనుదారు 2021 డిసెంబరు వరకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, 33.536 శాతం డీఏతో కలిపి, మధ్యంతర భృతితో కూడా లెక్క వేస్తే రూ.10,06,385 మొత్తం స్వీకరించారు. ఇందులో ఐఆర్గా స్వీకరించిన మొత్తం రూ.2,09,304గా తేల్చారు.
* ప్రస్తుతం ఆయనకు 2020 ఏప్రిల్ నుంచి కొత్త స్కేళ్లు లెక్కించారు. కొత్త మూల పింఛన్ను రూ.37,956గా లెక్కగట్టారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేనందున పైసా కూడా ఆ కేటగిరీలో లెక్క కట్టలేదు. 2021 జూన్ వరకు 7.28% చొప్పున డీఆర్ లెక్కకట్టారు. 2021 నుంచి 20.02% చొప్పున డీఆర్ లెక్కగట్టారు. ఫిట్మెంట్ 23% చొప్పున, పాత డీఏ మొత్తం కలిపి కొత్త మూల పింఛన్గా తేల్చినందున ఇక మధ్యంతర భృతిని లెక్కించలేదు. ఆ రూపేణా మొత్తం కొత్త పింఛను స్కేలు ప్రకారం ఆ పింఛనుదారుకు రూ.9,23,261 వస్తుంది. డీఆర్ బకాయిలను రూ.12,186గా లెక్కించారు. ఈ మొత్తాన్ని కలిపి కొత్త పింఛను స్కేళ్లు, నిబంధనల ప్రకారం మొత్తం రూ.9,35,447 రావాల్సి ఉందని నిర్ణయిచారు.
* పాత స్కేళ్ల ప్రకారం అందుకున్న రూ.10,06,386 నుంచి కొత్త స్కేళ్ల ప్రకారం రావాల్సింది తక్కువే (రూ.9,35,447) ఉండటంతో మినహాయించారు. ఈ పింఛనుదారు ప్రభుత్వానికి ఇంకా రూ.70,939 బకాయి పడ్డారు. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో ఇచ్చే డీఆర్ నుంచి మినహాయిస్తామని జీవోనే 19.3 నిబంధన స్పష్టంగా పేర్కొంది.
75 ఏళ్లు దాటిన వారికి ఇలా...
ఇదే జీవోలోని మరో పట్టికలో 75 ఏళ్లు దాటిన వారి పరిస్థితిని వివరించారు. పాత విధానంలో రూ.25,840 పాత మూల పింఛన్ ఉండి కొత్త మూల పింఛన్ రూ.39,682గా ఉన్న పింఛనుదారు రూ.1,07,170 ప్రభుత్వానికి బకాయి పడ్డారు. ఈయనకు భవిష్యత్తులో డీఆర్ అందదు.
* 70 ఏళ్ల వయసులోపు వారికి కొత్త లెక్కల ప్రకారం ఎంత బకాయి రానుందో లెక్కించారు. రూ.25,840 మూల పింఛన్ పొందేవారికి రూ.1,523 మేర బకాయిలు అందుతాయన్నారు.
* 80 నుంచి 85 ఏళ్ల మధ్య వారికీ ఇదే మూల పింఛన్ ఉంటే... వారికి రూ.41,251 పాత బకాయిల రూపంలో లభిస్తుంది.
* 85 నుంచి 90 ఏళ్ల మధ్య వారికి ఇదే మూల పింఛన్ ప్రకారం లెక్కిస్తే రూ.97,346 మేర బకాయిల రూపంలో అందుతుంది.
* 90 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఇదే మూల పింఛన్ ప్రకారం రూ.1,53,442 బకాయిగా అందుతుంది.
* 95-100 ఏళ్ల పైబడి వారికి ఇదే మూల పింఛన్ వద్ద 2,09,537 బకాయిగా అందుతుంది.
* అదే 100 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.5,62,474 మేర బకాయిలు అందుతాయని పేర్కొంది.
అంత్యక్రియల ఖర్చుల్లోనూ కోత
పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం అంత్యక్రియల ఖర్చులు చెల్లిస్తోంది. ఇంతవరకు ఒక నెల పింఛను ఇస్తోంది. కనీస మొత్తం రూ.15 వేలు ఉండేలా చెల్లించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని పేర్కొన్నారు. గతంలో నెల మొత్తం పింఛను ఎంత ఉంటే అంత పొందేవారు ఇకపై రూ.20 వేలకు మించి పొందరు. నెల పింఛను 25 వేలకు మించి ఉన్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కుటుంబాలు తాజా ఉత్తర్వులతో నష్టపోనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దల మాట
మన ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటరు అజ్ఞానం, అందరి భద్రతకు ముప్పు కలిగించవచ్చు. -
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
ఎప్పుడో బటన్ నొక్కి, నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. -
షర్మిల, సునీత, బీటెక్ రవి పిటిషన్ల కొట్టివేత
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్ పిటిషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. -
కోర్టు ఆదేశించినా స్టీల్ప్లాంటుకు బొగ్గు తరలింపునకు అవరోధం
అదానీ గంగవరం పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు తరలించడంలో అవరోధం కల్పించవద్దని నిర్వాసిత కార్మికులను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో ‘స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి కె.వెంకట దుర్గాప్రసాద్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. -
కేంద్రం నిధులు వాడేసుకొని జీతాలు ఇవ్వని జగన్ సర్కార్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించేసిన ప్రభుత్వం.. 2 నెలలుగా సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. -
మీ లాకర్ తెరిచారు.. అది మీరేనా?
‘విజయవాడ పటమటలోని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)లో ఉన్న మీ బ్యాంకు లాకరును సాయంత్రం 5.32 నిమిషాలకు తెరిచారు. అది మీరేనా? ఒకవేళ మీరు కాకుంటే వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించండి’ అని సందేశం వస్తే మీరేం చేస్తారు. -
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... ‘తోఫా’కో ధోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఉద్యోగాలు సృష్టించే నాయకుణ్ని ఎన్నుకోవాలి
ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం