CM Jagan: పాల సేకరణలో మోసాల నివారణకు తనిఖీలు
పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి విస్తృత తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు తక్కువ ఇస్తున్న ప్రైవేటు డెయిరీలు
అనంతపురంలో పాలసేకరణను ప్రారంభించిన సీఎం జగన్
ఈనాడు, అమరావతి: పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి విస్తృత తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మోసాల్లో పట్టుబడిన కేసులను పరిశీలిస్తే.. ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 చొప్పున తక్కువగా చెల్లిస్తున్నట్లు వెల్లడైందన్నారు. జగనన్న పాలవెల్లువలో భాగంగా అనంతపురం జిల్లాలో అమూల్ పాలసేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,900 బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్ల(బీఎంసీయూ)ను, 11,690 ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ యూనిట్ల(ఏఎంసీయూ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అమూల్ విస్తరించే కొద్దీ.. వీటన్నింటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ‘పాలు పోసే సమయంలో ఎన్ని లీటర్లు పోశారు? ఎంత ధర వస్తుందనే వివరాలతో రశీదు కూడా ఇస్తాం. నాణ్యతను పరీక్షించే విధానమూ ఉంది. మార్కెట్లో ఇతర ప్రైవేటు డెయిరీలు ఇచ్చే ధర కంటే అమూల్ అధికంగా చెల్లించి పాలను సేకరిస్తోంది. వచ్చిన లాభాలను బోనస్ రూపంలో ఆరు నెలలకోసారి వెనక్కి ఇస్తుంది. నిజంగా సహకారరంగం అంటే పాలు పోసే వారికే లాభాలొస్తాయి. దేశం మొత్తం మీద దానిని అమూల్ చూపించింది...’ అని ప్రశంసించారు. ఇప్పటివరకు ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పాలసేకరణ చేస్తున్న అమూల్.. ఇప్పుడు అనంతపురం జిల్లాలోకి వచ్చిందని సీఎం జగన్ వివరించారు.
అంగన్వాడీలకు పాలు, బాలామృతం సరఫరాపై అమూల్తో ఒప్పందం
రాష్ట్రంలో బాలామృతం, అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరాపై అమూల్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈ మేరకు పత్రాలపై సంతకాలు చేశారు. తమ సంస్థ గత 15 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో అంగన్వాడీలు, పాఠశాలల్లో రోజుకు 25 లక్షల మంది పిల్లలకు రోజూ తాజా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తోందని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్లోనూ ప్రాసెసింగ్ కేంద్రాలకు దగ్గరలోని కేంద్రాలకు తాజా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తాం. సబర్కాంత పాడి సహకార సంఘం ఆధ్వర్యంలో ప్లాంటు ఏర్పాటు చేసి అంగన్వాడీల్లోని పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం. రాష్ట్రంలో పాల ప్రాసెసింగ్కు తగిన సౌకర్యాలు కల్పించాలి. మదనపల్లిలో ఒక యూనిట్ ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో యూనిట్లు ప్రారంభమవుతాయి. అప్పుడు అక్కడే పాలు ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి విక్రయిస్తాం’ అని ఎండీ ఆర్ఎస్ సోధి వివరించారు. తమకు అవకాశం కల్పించిన సీఎం జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రోజుకు లక్ష లీటర్ల పాలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో సేకరణ మరింత పెరుగుతుందని చెప్పారు. తమ పాలకు అధిక ధర లభిస్తోందని ఈ సందర్భంగా పలువురు మహిళలు సీఎం జగన్కు వివరించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, సీఎస్ సమీర్శర్మ, వ్యవసాయ మిషన్ వైస్ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, కైరా మిల్క్, బనస్కాంత, సబర్కాంత పాల సంఘాల ఎండీలు అమిత్ వ్యాస్, సంగ్రామ్ చౌదరి, అనిల్ బయాతీ, అమూల్ సీనియర్ జీఎం రాజన్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.