కోర్టుకు హాజరు నుంచి జగన్కు మినహాయింపు
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా నేత జగన్మోహన్రెడ్డికి
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా నేత జగన్మోహన్రెడ్డికి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్నగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులకు నోటీసులిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. అప్పటివరకు కేసు విచారణలో జగన్కు హాజరు మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!