Pawan kalyan: శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించండి
జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజల కష్టాలు, వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లు దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. మొదట
ఏ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా అక్కడ ఉండే ఓ రోడ్డుకు మరమ్మతులు చేయండి
జిల్లా అధ్యక్షుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి: జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజల కష్టాలు, వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లు దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. మొదట ఆ ప్రాంతం పరిధిలో దెబ్బతిన్న ఒక రోడ్డును గుర్తించి దానికి మరమ్మతులు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల సమస్యపై ప్రజాస్వామ్య పద్ధతిలో తొలుత అందరి దృష్టికి తీసుకెళ్లాం. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. జనసేన పార్టీ శ్రమదానం ద్వారా వాటికి మరమ్మతులు చేపడితే ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ప్రజలందరూ చూశారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన లభించింది. ఇకపై కూడా ఈ శ్రమదానం స్ఫూర్తి కొనసాగించాలి. సగటు మనిషి అభివృద్ధి తద్వారా రాష్ట్రాభివృద్ధి జనసేన లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్ని అయినా ప్రజాకోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో నేను పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తా...’ అని పేర్కొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శ్రేణుల్ని జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకోవాలని, పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్ని ప్రభావవంతంగా నిర్వహించాలని చెప్పారు. పార్టీ మండల, గ్రామ కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
నవంబరు 15 నాటికి మండల కమిటీల నియామకం పూర్తి
జిల్లా అధ్యక్షులు, కమిటీల నియామకం పూర్తయిన జిల్లాల్లో నవంబరు 15వ తేదీ నాటికి మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సమీక్ష కొనసాగింది. అనంతరం వివిధ జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్, షేక్ రియాజ్, పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్రెడ్డి, తదితరులతో కలిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆయన వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రతి డివిజన్, వార్డుల్లో పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టాలని తీర్మానించాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించాం. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత చిన్న వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఉన్న సమస్యలపై జనసేన శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గానికి పంపించాలని అధ్యక్షుడు మాకు సూచించారు. పార్టీ క్రియాశీలక సభ్యుల్ని బలోపేతం చేసే దిశగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం....’ అని కందుల దుర్గేష్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్