Ap High Court: పాత్రికేయుడు అంకబాబుపై కేసులో సీఐడీకి హైకోర్టు షాక్
సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై నమోదు చేసిన కేసులో సీఐడీకి హైకోర్టు గట్టి షాకిచ్చింది.
ఎఫ్ఐఆర్ కొట్టివేత
సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని స్పష్టీకరణ
రెండు గ్రూపుల మధ్య విద్వేషం కలిగించలేదని వెల్లడి
ఈనాడు, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై నమోదు చేసిన కేసులో సీఐడీకి హైకోర్టు గట్టి షాకిచ్చింది. నమోదు చేసిన సెక్షన్లు ఆయన విషయంలో వర్తించవని స్పష్టం చేసింది. రెండు గ్రూపుల మధ్య విద్వేషం రేకెత్తించిన ప్రస్తావనే లేదంది. పిటిషనర్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అని చెబుతున్న దాని వల్ల సీఎం కార్యాలయ సిబ్బంది, ఇతర వ్యక్తులకు దురభిప్రాయం/ద్వేషం (ఇల్విల్) లేదా పగ పెంపునకు కారణం అయ్యింది అనుకున్నప్పటికీ.. ఈ విషయంలో సెక్షన్ 153ఏ, 505ఏ వర్తించదని తేల్చి చెప్పింది. అసలు రెండు గ్రూపుల ప్రస్తావనే లేదంది. సీఎంవో కార్యాలయానికి వ్యతిరేకంగా దురభిప్రాయం సృష్టించడం.. రెండు గ్రూపుల మధ్య దురభిప్రాయం లేదా ద్వేషం కలిగించడం కిందకు రాదంది. ఒకవేళ రెండు గ్రూపుల మధ్య విద్వేషం కలిగించారనుకున్నా.. ఇక్కడ అ సెక్షన్ వర్తించదని తెలిపింది. ఎందుకంటే ఇది మతం, తెగల మధ్య శతృత్వం పెంచిన వ్యవహారం కాదంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 153ఏ, 505ఎలు వర్తించవని పేర్కొంది. ఆ రెండు సెక్షన్లు వర్తించకపోతే అసలు 120బి వర్తించే ప్రశ్నే ఉత్పన్నం కాదంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్ గ్రూపులో ఫార్వర్డ్ చేశారనే ఆరోపణలతో అందిన ఫిర్యాదు ఆధారంగా 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై సీఐడీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఎంవో కార్యాలయ మేనేజరు తిరుపతి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అంకబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది టి.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ... ‘ఐపీసీ సెక్షన్ 153(ఎ), 505(ఎ) రెడ్విత్ 120బి కింద కేసు నమోదు చేశారు. వివిధ గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పిటిషనర్పై నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. ఫిర్యాదులోని ఆరోపణలు, రిమాండ్ రిపోర్టులోని అంశాలేవి సెక్షన్ 153ఏ, 505(ఎ) కిందకు రావు. ఇతరులతో కలిసి పిటిషనర్ కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలే లేవు. ఈ నేపథ్యంలో సెక్షన్ 120బి కింద నమోదు చేసిన సెక్షన్ చెల్లదు...’ అని పేర్కొన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.
సెక్షన్ల మధ్య వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
‘సహజంగా దర్యాప్తు ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి అయిష్టత చూపుతుంది. ఫిర్యాదులోని అంశాలు, దర్యాప్తులో తేలిన అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేసేందుకు జోక్యం చేసుకోవచ్చు. సెక్షన్ 153ఏ, 505ఏ కింద నేరానికి పాల్పడినట్లు తేలితేనే ఐపీసీ సెక్షన్ 120బీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 153ఏ, 505ఏ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 153ఏ కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాలంటే నిందితుడు.. మాటలు లేదా రాతపూర్వకంగా, ఇతర పద్ధతుల్లో వివిధ మతాలు, కులాలు, తెగలు, గ్రూపుల మధ్య శతృత్వం పెంచేలా ఉండాలి. సామరస్యాన్ని దెబ్బతీసేదిగా ఉండాలి. సెక్షన్ 153ఏలోని ఉప క్లాజులు ఏ,బీ,సీల కింద నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు గ్రూపుల మధ్య విరోధానికి కారణమై ఉండాలి. ఒక గ్రూపుపై దురభిప్రాయం/ద్వేషం కలిగి ఉంటే మాత్రం ఈ సెక్షన్ వర్తించదు. విరోధం పెంచాలన్న ఉద్దేశంతో చేసిన పని అయిఉండాలి. కేవలం మతాలు, తెగలు, భాష, కులాల మధ్య శతృత్వానికి దారి తీసినప్పుడు మాత్రమే ఆ సెక్షన్లు వర్తిస్తాయి...’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీఐడీ ప్రత్యేక పీపీ శివకల్పనరెడ్డి వాదనలు వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది.